దిల్లీపైనే ఒత్తిడి.. కానీ..!
టీ20లీగ్ 13వ సీజన్లో అంతిమ పోరాటానికి దుబాయ్ సిద్ధమైంది. రోహిత్శర్మ సారథ్యంలోని డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఆరోసారి ఫైనల్కు చేరింది. ఈరోజు రాత్రి 7.30గంటలకు యువసంచలనం దిల్లీతో టైటిల్ పోరుకు సిద్ధమైంది.
టీ20లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమంటున్న హిట్మ్యాన్
దుబాయ్: టీ20 లీగ్ 13వ సీజన్లో అంతిమ పోరాటానికి దుబాయ్ సిద్ధమైంది. రోహిత్శర్మ సారథ్యంలోని డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఆరోసారి ఫైనల్కు చేరింది. ఈరోజు రాత్రి 7.30గంటలకు యువసంచలనం దిల్లీతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. నాలుగు సార్లు ట్రోఫీని ముద్దాడిన ముంబయి జట్టు ఈ మ్యాచ్లో హాట్ ఫేవరేట్గా కనిపిస్తోంది. అయితే, ఫైనల్ మ్యాచ్కు ముందు ముంబయి కెప్టెన్ రోహిత్శర్మ తమ సన్నద్దత గురించి మాట్లాడాడు. దిల్లీపైనే ఒత్తిడి ఉందంటూనే.. టీ20లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం.. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయమని అంటున్నాడు.
జట్టు ఏ ఒక్కరిపై ఆధారపడదు
‘‘మేం టోర్నీ మొదటి నుంచి చెప్తున్న మాట ‘జట్టు ఏ ఒక్కరిపై ఆధారపడదు’. అదే ముంబయి జట్టు ప్రత్యేకత. జట్టులో ఏ ఒక్కరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ల రికార్డులే వాళ్ల ప్రతిభ గురించి మాట్లాడతాయి. ఈ సీజన్లో సూర్యకుమార్ ప్రదర్శన అద్భుతం. అలాంటి బ్యాట్స్మెన్ క్రీజులో ఉంటే నాన్స్ట్రైకర్పై ఒత్తిడి ఉండదు. జట్టు ఎన్ని వికెట్లు కోల్పోయిందన్న విషయాన్ని సూర్యకుమార్ పట్టించుకోడు. తన శైలిని నమ్ముకొని బ్యాటింగ్ చేస్తాడు. అతను నిలకడగా రాణిస్తున్నాడు. అది జట్టుకు శుభపరిణామం. ఇషాన్కిషన్ సులభంగా సిక్సర్లు, ఫోర్లు కొడుతూ ఈ సీజన్లో బాగా రాణించాడు. మిడిల్ ఓవర్లలో రాహుల్ వికెట్లు తీస్తున్నాడు’’ అని రోహిత్ అన్నాడు.
ఫైనల్లో సర్ప్రైజ్లు ఉంటాయి
‘‘ఫైనల్ మ్యాచ్కు జట్టులో మార్పులు ఉంటాయి. అది అభిమానులకు సర్ప్రైజ్లాంటిది. వాళ్ల జట్టులో ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ ఉన్నారు. వాళ్లను కట్టడి చేయాలంటే అందుకు తగ్గట్లుగా మా బౌలింగ్లో మార్పులు తప్పనిసరి. జయంత్యాదవ్ మాకొక మంచి వనరు. లీగ్ స్థాయిలో దిల్లీతో ఆడిన మ్యాచ్లో అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను కూడా జట్టులో ఉండే అవకాశం ఉంది. గాయంతో బాధపడుతున్న ట్రెంట్బౌల్ట్ జట్టులో ఉంటాడా లేదా అనేది వేచి చూడాలి. అతను జట్టు కోసం ఎన్నో మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. మరోసారి ప్రతిభ నిరూపించుకుంటాడని ఆశిస్తున్నాం’ అని రోహిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
దిల్లీపైనే ఒత్తిడి..
‘‘ఈ సీజన్లో దిల్లీతో జరిగిన మూడు మ్యాచుల్లోనూ మేం విజయం సాధించాం. ఆ ఫలితాలు దిల్లీ జట్టుపై ఒత్తిడి పెంచే అవకాశం లేకపోలేదు. కానీ.. ఇది టీ20. ప్రతి మ్యాచ్ ప్రత్యేకం. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. కేవలం ఒకేఒక్క ఆటగాడు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయవచ్చు. దిల్లీని తక్కువ అంచనా వేయబోం. అన్ని విభాగాల్లో రాణిస్తే ఐదో ట్రోఫీ ముంబయి ఖాతాలో చేరుతుందనడంలో అనుమానం లేదు. టాస్ గెలవడం ఈ మ్యాచ్లో కీలకమని నా ఉద్దేశం. ఏదేమైనా మా దృష్టి మొత్తం మ్యాచ్లో మంచి ప్రదర్శన ఇవ్వడంపైనే ఉంటుంది’ అని ముంబయి సారథి పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్