రవీంద్ర జడేజాకు హ్యాట్సాఫ్: మంజ్రేకర్
గతేడాది వన్డే ప్రపంచకప్ సమయంలో టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ‘బిట్స్ అండ్ పీసెస్’ క్రికెటర్ అని సంబోధించి అందరి చేతా విమర్శలకు గురైన క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తాజాగా...
ఇంటర్నెట్డెస్క్: గతేడాది వన్డే ప్రపంచకప్ సమయంలో టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ‘బిట్స్ అండ్ పీసెస్’ క్రికెటర్ అని సంబోధించి అందరి చేతా విమర్శలకు గురైన క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తాజాగా అతడిని ‘హ్యాట్సాఫ్’ అని మెచ్చుకున్నాడు. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో జడేజా(66*).. పాండ్య(92*)తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి ఆస్ట్రేలియాకు 300పై చిలుకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ క్రమంలోనే కంగారూలు 289 పరుగులకు ఆలౌటై ఓటమిపాలయ్యారు.
అయితే, అప్పట్లో జడేజాను విమర్శించాక మంజ్రేకర్పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అప్పుడు జడ్డూ సైతం దీటుగానే జవాబిచ్చాడు. ఆపై బీసీసీఐ మంజ్రేకర్ను వ్యాఖ్యాతగా తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యూఏఈలో జరిగిన ఐపీఎల్లో అతడికి అవకాశం ఇవ్వలేదు. మరోవైపు 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీతో కలిసి జడ్డూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో మ్యాచ్ను గెలుపు ముంగిటి వరకు తీసుకెళ్లి మంజ్రేకర్ వ్యాఖ్యలకు సరైన జవాబిచ్చాడు. ఇక ఈ ఏడాది ఆడిన 9 వన్డే మ్యాచ్ల్లోనూ ఈ ఆల్రౌండర్ తన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 223 పరుగులు చేసి 56.75 సగటు సాధించాడు. తాజా వన్డే సిరీస్లోనూ 25, 24, 66 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలోనే మంజ్రేకర్ అతడిని ప్రశంసలతో ముంచెత్తాడు.
‘ఈ మ్యాచ్లో ఆఖరి 3-4 ఓవర్లు అతడు చాలా తెలివిగా ఆడాడు. జడ్డూ బంతిని కాచుకున్న విధానం ఎంతో నచ్చింది. ఆఫ్సైడ్, ఆన్సైడ్ తేడా లేకుండా పరుగులు చేశాడు. తన బ్యాటింగ్తో పాండ్య మీద ఒత్తిడిని తగ్గించాడు. అతడి వన్డే కెరీర్లో ఇదో అత్యుత్తమ ఇన్నింగ్స్గా మిగిలిపోతుంది. అతడు బ్యాట్తో రాణించడంతోనే టీమ్ఇండియా పోటీలో నిలబడింది. అయితే, జడ్డూ బౌలింగ్లో మరిన్ని వికెట్లు తీయాలి. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఈ విషయం చెప్పాను. బ్యాటింగ్లో మెరుగవుతున్నా బౌలింగ్లో మాత్రం శ్రమించాలి. ఇక ఈ ఆట విషయానికొస్తే అతడికి హ్యాట్సాఫ్ చెప్పాలి’ అని మంజ్రేకర్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. ఇక పాండ్య, జడేజా భాగస్వామ్యంపై స్పందించిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్మాక్స్వెల్.. వాళ్లిద్దరే తమ జట్టుకు విజయాన్ని దూరం చేశారన్నాడు. టీమ్ఇండియాను 152కే ఐదు వికెట్లు తీసి ఇబ్బంది పెట్టినా తర్వాత వారిద్దరూ బాధ్యతగా ఆడారన్నాడు. హిట్టింగ్తో తమపై ఒత్తిడి పెంచి మంచి భాగస్వామ్యం నెలకొల్పారని మెచ్చుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి