దాదా, కుంబ్లే నాయకత్వం నాకు ప్రత్యేకం: పార్థివ్
టీమ్ఇండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ నిజమైన నాయకుడని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అన్నాడు. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన జీవితంపై చెరగని ముద్రవేశాడని పేర్కొన్నాడు. అన్ని ఫార్మాట్లలో క్రికెట్కు వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయంగా భావించానని...
ముంబయి: టీమ్ఇండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ నిజమైన నాయకుడని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అన్నాడు. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన జీవితంపై చెరగని ముద్రవేశాడని పేర్కొన్నాడు. అన్ని ఫార్మాట్లలో క్రికెట్కు వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయంగా భావించానని పేర్కొన్నాడు. 17 ఏళ్ల వయసులో టీమ్ఇండియాలో ప్రవేశించిన పార్థివ్ (35 ఏళ్లు) బుధవారం అన్ని ఫార్మాట్లలో వీడ్కోలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
‘సౌరవ్ గంగూలీ అత్యుత్తమ నాయకుడని నేనెప్పటికీ భావిస్తుంటా. అతడి నిర్వాహక నైపుణ్యాలు అద్భుతం. సౌరవ్, అనిల్ కుంబ్లే గొప్ప నాయకులు. నేనిప్పుడున్న వ్యక్తిగా మారేందుకు వారే కారణం. టెస్టు అరంగేట్రం చేసినప్పుడు దాదా ఇచ్చిన టోపీ ఇప్పటికీ నావద్దే ఉంది. దానిపై నాపేరు తప్పుగా ముద్రించారు. హెడింగ్లే (2002), అడిలైడ్ (2003-04), రావల్పిండిలో ఓపెనర్గా చేసిన అర్ధశతకం నాకెంతో ఇష్టమైన ఘటనలు’ అని పార్థివ్ అన్నాడు.
ఏడాది కాలంగా వీడ్కోలు గురించి ఆలోచిస్తున్నా సరైన సమయంగా అనిపించలేదని పార్థివ్ పేర్కొన్నాడు. ‘వీడ్కోలు విషయం చెప్పగానే మా కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టారు. అయితే నిర్ణయం తీసుకున్న నేను ప్రశాంతంగా నిద్రపోయాను. 18 ఏళ్లు క్రికెట్లో ఉన్నాను. ఇంకా సాధించేందుకు ఏమీ లేదనిపించింది. దేశవాళీ క్రికెట్లో అన్ని టోర్నీలూ గెలిచాను. మూడు ఐపీఎల్ ట్రోఫీలు అందుకున్నాను. గుజరాత్ క్రికెట్ను సరైన స్థితిలో ఉంచాను’ అని తెలిపాడు.
ఎంఎస్ ధోనీ సమయంలో టీమ్ఇండియాలో చోటు దక్కకపోవడంతో పార్థివ్ రంజీల్లో శ్రమించాడు. ‘భారత్ 2009లో న్యూజిలాండ్లో ఓసారి పర్యటించింది. రంజీ ట్రోఫీలో నేను 800 పరుగులు చేశాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో శతకం బాదా. అయినా జాతీయ జట్టుకు పిలుపు రాలేదు. ఇక అంతే అనుకున్నాను. దాంతో గుజరాత్ జట్టును నిర్మించడం మొదలుపెట్టాను. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాను. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లతో ట్రోఫీలు అందించాను’ అని పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం వృద్ధిమాన్ సాహాయే భారత్లో అత్యుత్తమ కీపర్ అని, టీమ్ఇండియాలో చోటు దక్కాలంటే కీపింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ అదరగొట్టాల్సి ఉంటుందని వెల్లడించాడు.
ఇవీ చదవండి
ఆసీస్పై విజయానికి కారణమదే అంటున్న ఆటగాళ్లు
క్రికెట్కు పార్థివ్ పటేల్ గుడ్బై
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్