టీమ్ఇండియా @ 2020 అంతంతే..!
2020 ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. కరోనా పరిస్థితుల ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా జరిగిందేమీ లేదు. అన్ని రంగాల్లాగే క్రీడలు సైతం సుమారు 6 నెలలు నిలిచిపోయాయి...
ఏడాదంతా ఎలా సాగిందంటే..
2020 ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. కరోనా పరిస్థితుల ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా జరిగిందేమీ లేదు. అన్ని రంగాల్లాగే క్రీడలు సైతం సుమారు 6 నెలలు నిలిచిపోయాయి. ఒలింపిక్స్వంటి మహా సంగ్రామమే వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇక పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాక తగు జాగ్రత్తలతో నిర్వాహకులు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్ కూడా ఈ ఏడాది అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంది. అలాంటి పరిస్థితుల్లో భారత్ ఈ సంవత్సరం మొత్తం ఎన్ని మ్యాచ్లు ఆడింది? ఎలా సాగింది? విజయాల శాతం ఎంత తదితర విషయాలు తెలుసుకుందాం.
శుభారంభం దక్కింది..
ఈ ఏడాది టీమ్ఇండియా మొత్తం ఆడిన మ్యాచ్ల సంఖ్య 24. అందులో 12 మ్యాచ్ల్లో విజయం సాధించగా మరో 12 మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. ఆస్ట్రేలియాతో ఇంకో టెస్టు ఈనెల 26 నుంచి జరగాల్సి ఉంది. తొలుత జనవరిలో శ్రీలంకతో 3 టీ20ల సిరీస్ ఆడిన కోహ్లీసేన 2-0తో విజయం సాధించి 2020ని ఘనంగా ఆరంభించింది. ఆపై ఆస్ట్రేలియాతో తలపడిన మూడు వన్డేల సిరీస్లో 2-1 తేడాతో మరో కప్పు సాధించింది. దీంతో ఆదిలోనే శుభారంభం చేసి ఏడాదిపై ఆశలు రేకెత్తించింది.
ఉర్రూతలూగించి ఉసూరుమనిపించింది..
వరుసగా రెండు సిరీస్లు గెలుపొందిన ఉత్సాహంలో న్యూజిలాండ్లో అడుగుపెట్టిన టీమ్ఇండియాకు అక్కడ మరో అద్భుత సిరీస్ సొంతమైంది. తొలుత ఆ జట్టును 5-0 తేడాతో టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. ఇందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. 3, 4 టీ20 మ్యాచ్లు స్కోర్లు సమం కాగా, భారత్ సూపర్ ఓవర్లలో గెలుపొందింది. ఆ తర్వాత 3 వన్డేల సిరీస్, 2 టెస్టుల సిరీస్లో చతికిల పడింది. ఈ ఐదింటిలో కనీసం ఒక్క మ్యాచ్ కూడా విజయం దక్కకుండా ఘోర పరాభవం చవిచూసింది. దీంతో కివీస్లో టీ20ల్లో అదరగొట్టిన కోహ్లీసేన తర్వాత ఘోరంగా విఫలమైంది.
అంతా అవాక్కయ్యేలా చేసింది..
ఇక కరోనా పరిస్థితుల కారణంగా చివరగా మార్చి 4న న్యూజిలాండ్తో రెండో టెస్టు ఆడిన భారత్ 9 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడింది. మార్చిలో దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉన్నా అది వాయిదా పడింది. ఆపై లాక్డౌన్.. అనంతరం సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ జరిగాయి. ఈ క్రమంలోనే దుబాయ్ నుంచి నేరుగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది టీమ్ఇండియా. ఇక్కడ తొలుత 3 వన్డేల సిరీస్లో 1-2 తేడాతో ఓటమిపాలవ్వగా తర్వాత 3 టీ20ల సిరీస్లో 2-1 తేడాతోనే గెలుపొందింది. దీంతో వన్డే సిరీస్ ఓటమికి బదులు తీర్చుకుంది. ఈ క్రమంలోనే అడిలైడ్లో తొలి టెస్టు ఆడిన కోహ్లీసేన సుదీర్ఘ ఫార్మాట్ చరిత్రలోనే ఘోర పరాభవం ఎదుర్కొంది. తొలి ఇన్నింగ్స్లో మ్యాచ్పై పట్టు బిగించేలా కనిపించినా శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో 36కే కుప్పకూలి అభిమానులను నిరాశపర్చింది.
* దీన్ని బట్టి చూస్తే భారత్ ఈ ఏడాది మొత్తం మిశ్రమ ఫలితాలు సాధించిందని చెప్పొచ్చు. అయితే, ఆటలో గెలుపోటములు సహజమే అయినా, ఏడాది చివర్లో టీమ్ఇండియా మరీ ఇంత ఘోరంగా విఫలమవ్వడమే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు టీమ్ఇండియా ప్రధాన ఆటగాడు రోహిత్ శర్మ ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, ఆపై న్యూజిలాండ్తో టీ20 సిరీస్ మాత్రమే ఆడాడు. అంతకుముందు శ్రీలంకతో టీ20 సిరీస్, ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో ఏ మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో అతడు లేని లోటు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
- ఇంటర్నెట్డెస్క్
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.