చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
ఆస్ట్రేలియా పర్యటనలో భారత ఆటగాళ్లకు ఎన్నో గాయాలు. సీనియర్ల గైర్హాజరీ. అంతేగాక భారత క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదవ్వడం. ఇన్ని ప్రతికూలతల్లోనూ టీమిండియా అద్వితీయం...
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఎదురీదుతోంది. ఆటగాళ్లకు గాయాలు.. సీనియర్ల గైర్హాజరీ.. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు వంటి ప్రతికూలతల్లోనూ టీమిండియా అద్వితీయంగా పోరాడుతోంది. టెస్టు సిరీస్ను సాధించాలన్న కసితో ఆడుతోంది. అయితే, నిర్ణయాత్మక చివరి టెస్టు అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఇంకా రెండు రోజుల ఆటే మిగిలింది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ టీమిండియాకు స్ఫూర్తి రగిలించేలా మాట్లాడారు. దీన్ని సెవన్ క్రికెట్ తమ ట్విటర్ ఖాతాలో పంచుకుంది.
‘‘గబ్బా టెస్టు చివరి రెండు రోజుల ఆటలో ఫలితం ఏదైనా కావొచ్చు. మా క్రికెటర్ల పట్ల ఎంతో గర్వపడుతున్నాం. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చినప్పుడు అసలైన సవాళ్లు ఏంటో నాకు తెలిశాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఈ సిరీస్ ఓ అద్భుతం. భారత ఆటగాళ్ల సంకల్పం, ధైర్యం, పోరాటం స్ఫూర్తిదాయకం’’
‘‘అయిదు నెలల నుంచి ఇంటికి దూరంగా ఉన్నారు. కోరుకోని ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచమంతా చూస్తోంది. ఆటగాళ్లు గాయపడ్డారు. ఎన్నో ప్రతికూలతలు.. అయినా టీమిండియా అద్వితీయంగా పోరాడుతోంది. ట్రోఫీ సాధించడం కోసం అసాధారణంగా ఆడుతోంది. ఆస్ట్రేలియన్లు వాళ్ల జట్టును, ప్రత్యర్థులను గౌరవిస్తారని తెలుసు. ఈ సిరీస్లో భారత ఆటగాళ్లు చేసిన పోరాటాన్ని ఎన్నటికీ మరవలేరు’’ అని గావస్కర్ తెలిపారు.
తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధిచింది. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో భారత్ 36 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే అద్భుత పోరాటంతో రెండో టెస్టులో విజయ ఢంకా మోగించిన టీమిండియా మూడో టెస్టును డ్రాగా ముగించింది. ప్రస్తుతం నాలుగో టెస్టు గబ్బా మైదానంలో జరుగుతుంది.
ఇదీ చదవండి
కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
స్మిత్ ఔట్: ఆసీస్ ఆధిక్యం 229
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.