Hardik Pandya : గుజరాత్ సక్సెస్ వెనుక స్టోరీ అదే: హార్దిక్
తొలి క్వాలిఫయిర్ మ్యాచ్లో రాజస్థాన్పై అద్భుత విజయంతో గుజరాత్ ఫైనల్కు దూసుకెళ్లింది. నిన్న రాత్రి (మే 24న) జరిగిన మ్యాచ్లో...
ఇంటర్నెట్ డెస్క్: తొలి క్వాలిఫయిర్ మ్యాచ్లో రాజస్థాన్పై అద్భుత విజయంతో గుజరాత్ ఫైనల్కు దూసుకెళ్లింది. నిన్న రాత్రి (మే 24న) జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 188/6 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో 191 పరుగులు చేసి విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం గుజరాత్ సారథి హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. ‘‘మైదానం లోపల, వెలుపల సమతూకంగా ఉండేలా చూసుకుంటున్నాను. కెప్టెన్గా ఎంతో నేర్చుకుంటున్నా. గత కొన్నేళ్లుగా నా జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నా’’ అని పేర్కొన్నాడు.
తొలిసారి కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్య గుజరాత్ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనలోనూ మెరుగుపడ్డాడు. ఇప్పటి వరకు 15 మ్యాచుల్లో 453 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ‘‘ఈ సీజన్లో ఇలా రాణించడంలో నా కుటుంబ సభ్యులదే కీలక పాత్ర. అందులో నా భార్య, కొడుకు, నా సోదరుడు సహా అందరూ మద్దతుగా నిలిచారు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్థిరంగా ఉండగలుగుతున్నా. ఇకపోతే సీజన్ ముగిశాక ఇంటికెళ్లి నా కుటుంబంతో సమయం గడపాలి. అదే నన్ను ఉత్తమ క్రికెటర్గా మారుస్తుంది’’ అని వివరించాడు.
డేవిడ్ మిల్లర్ అలాంటి సమర్థుడే: హార్దిక్
ద
గుజరాత్ ఫైనల్కు చేరుకోవడం ఎలా అనిపించిందనే ప్రశ్నకు సమాధానంగా.. ‘ఇప్పుడైతే ఎలాంటి భావోద్వేగం లేదు. ఎందుకంటే నిశ్శబ్దంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. అద్భుత విజయం సాధించడం వెనుక జట్టు సభ్యుల కృషి ఎంతో ఉంది. డ్రెస్సింగ్ రూమ్ ఎంతో బాగుంది. మా టీమ్లోని 23 మంది ఆటగాళ్లు వేర్వేరు క్యారెక్టర్లు కలిగినవారు. అందుకే వేర్వేరు ఆలోచనలను పంచుకోగలిగాం. మంచివాళ్లు పక్కన ఉంటే మంచి ఆలోచనలే వస్తాయి. ఇదే ఇప్పటి వరకు మా సక్సెస్ వెనుక ఉన్న స్టోరీ. జట్టు గెలవాలని డగౌట్లోనూ మా ఆటగాళ్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రషీద్ ఖాన్ సీజన్ మొత్తం బాగా బౌలింగ్ చేస్తున్నాడు. డేవిడ్ మిల్లర్ ఒంటిచేత్తో మ్యాచ్లను గెలిపించగల సమర్థుడు. మిల్లర్ ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. ఇకపోతే నేను జట్టుకు అవసరమైనప్పుడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్కు వస్తా. ఈ ప్లేస్లోనే బ్యాటింగ్కు వెళ్తాననే డిమాండ్ ఎప్పుడూ ఉండదు’’ అని హార్దిక్ స్పష్టం చేశాడు. ఇవాళ జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో విజేతతో తొలి క్వాలిఫయిర్లో ఓటమిపాలైన రాజస్థాన్ మే 27న రెండో క్వాలిఫయర్ పోరులో తలపడుతుంది. అనంతరం అక్కడ గెలిచిన జట్టు ఫైనల్లో గుజరాత్ను ఢీకొడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
ముంబయి వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. చివరి మూడు మ్యాచుల్లో గెలిచినా నాకౌట్ దశకు చేరుకోవడం కష్టమే. గెలుస్తామనుకున్న మ్యాచుల్లోనే ఓటమిపాలై అభిమానులను నిరాశకు గురి చేసింది. -
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ పొట్టి కప్ బరిలోకి దిగబోతున్నాడు. ఈసారైనా తన ప్రపంచ కప్ కలను నెరవేర్చుకోవాలంటే కీలకమైన మూడో స్థానంలో అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. -
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
డేవిడ్ వార్నర్ మైదానంలో దూకుడుగా ఆడేస్తాడు. సోషల్ మీడియాలో వీడియోలతో అభిమానులను అలరిస్తాడు. భారత క్రికెట్ అభిమానులకు చాలా దగ్గరైన ఆటగాళ్లలో వార్నర్ ఒకడు. -
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టు గురించి భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. సరైన జట్టును ఎంపిక చేశారని సెలక్టర్లను అభినందించాడు. -
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
భారీగా పరుగులు చేస్తున్నా.. విరాట్ కోహ్లీపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. వాటిని భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్, కైఫ్ కొట్టిపడేశారు. -
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
ముంబయి స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్కు రాలేదు. అతడిని ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వెల్లడించడం గమనార్హం. -
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
ఐపీఎల్ 2024 సీజన్ ముంబయికి కలిసిరాలేదు. ఆరంభం నుంచే ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. -
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!