IND vs AFG: క్రీడా స్ఫూర్తి.. మళ్లీ నన్ను క్షమించండి: రవిచంద్రన్ అశ్విన్
ఎవరైనా విజయం కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ, క్రీడా స్ఫూర్తితో ఆడితే గౌరవం మరోలా ఉంటుంది. సరైన ఆట ప్రదర్శించకపోతే విమర్శలు ఎదుర్కోవడమూ సహజమే. భారత్ - అఫ్గాన్ మూడో టీ20 (IND vs AFG) సందర్భంగానూ మరోసారి క్రీడాస్ఫూర్తి చర్చకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-అఫ్గానిస్థాన్ మూడో టీ20లో (IND vs AFG) సూపర్ ఓవర్లు మాత్రమే కాకుండా.. ఇరు జట్ల సీనియర్ల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అఫ్గాన్ ఆటగాడు మహమ్మద్ నబీ పరుగు తీస్తున్న క్రమంలో బంతి అతడి ప్యాడ్లను తాకి దూరంగా వెళ్లింది. దీంతో అదనంగా ఆ జట్టు రెండు పరుగులను రాబట్టుకుంది. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశారు. నబీతో రోహిత్ చర్చించిన వీడియోలు వైరల్గా మారాయి. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా అఫ్గాన్ బ్యాటర్ వ్యవహరించాడని భారత అభిమానులు కామెంట్లు చేశారు. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా టీమ్ఇండియా వైఖరి సరైంది కాదని ఆక్షేపించాడు. క్రీడాస్ఫూర్తి అనే పదం వినపడగానే అందరి మదిలో మెదిలే రవిచంద్రన్ అశ్విన్ కూడా దీనిపై స్పందించాడు.
‘‘ప్రతి కథకూ రెండు పార్శాలుంటాయి. ఫీల్డ్లో మనం ప్రభావితమైతే అసహనం రావడం సహజమే. అక్కడ మేం ఉంటే ఇలా చేయం అని చెబుతాం. ఏదేమైనా అది మన వ్యక్తిగత అభిప్రాయం. భారత క్రికెట్ అభిమానిగా చెబుతున్నా.. వచ్చే వరల్డ్ కప్ నాకౌట్లో సూపర్ ఓవర్ను మనం ఎదుర్కోవాల్సి వచ్చిందనుకుందాం.. కేవలం ఒక్క బంతికి రెండు పరుగులు చేయాలి. వికెట్ కీపర్ మన ప్యాడ్లను తాకేలా విసిరాడనుకుందాం.. అప్పుడు మనం పరుగు తీయకుండా ఉంటామా? బ్యాటర్గా మనం రన్ చేయకుండా ఎందుకు ఉండాలి? ఇప్పుడు మూడో టీ20లోనూ ఇదే విధమైన చర్చ జరుగుతోంది’’
‘‘ఇప్పటివరకు జరిగిన దీనిపై వివరణ ఇద్దామని వచ్చా. బౌలర్ వికెట్ తీయాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతాడు. బ్యాటర్ పరుగుల కోసం ఆడతాడు. బంతి ప్యాడ్లను తాకితే అది లెగ్బై. ఒకవేళ బ్యాట్ను, శరీరాన్ని తాకకుండా బంతి కీపర్ వద్దకు వెళ్లినప్పుడు పరుగు తీస్తే అది బై. క్రీజ్కు దూరంగా వెళ్తే వైడ్. బాల్ వేసేటప్పుడు బౌలర్ కాలు క్రీజ్ను దాటినా, బ్యాటర్ నడుము ఎత్తుపై వస్తే నో బాల్ అవుతుంది. ఎలా వేసినా బౌలర్ వికెట్ తీయడం కోసమే చేస్తాడు. పరుగు ఇవ్వకుండా ఉండాలనే ప్రయత్నిస్తాడు. దీని ప్రకారం.. ఫీల్డర్ కూడా బంతిని విసిరి బ్యాటర్ను రనౌట్ చేద్దామని చూస్తాడు. రనౌట్ చేయడానికి పరుగెత్తే క్రమంలో.. ఆ త్రో పక్క నుంచి వెళ్లింది. అప్పుడు ఆ బ్యాటర్కు రన్ తీసే హక్కు ఉంది. ఇక క్రీడాస్ఫూర్తి అంటారా.. మళ్లీ నన్ను క్షమించండి’’ అని అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆట తీరుపై నెట్టింట విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా స్ట్రైక్రేట్ ఉండటం లేదని కొందరు మాజీలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వాటిపై ఏబీ డివిలియర్స్ స్పందించాడు. -
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
ఈ ఐపీఎల్ సీజన్లో తొలిసారి ధోనీ ఔటయ్యాడు. అయితే, అతడు చివరి ఓవర్లో సింగిల్ను తిరస్కరించడంపై నెట్టింట చర్చకు తెర లేచింది. -
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ