తొలి రోజు ఆస్ట్రేలియా 274/5
బోర్డర్-గావస్కర్ సిరీస్లో చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్(108; 204 బంతుల్లో 9x4) శతకం సాధించగా...
శతకంతో మెరిసిన లబుషేన్
బ్రిస్బేన్: బోర్డర్-గావస్కర్ సిరీస్లో చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్(108; 204 బంతుల్లో 9x4) శతకం సాధించగా, మాథ్యూవేడ్(45; 87 బంతుల్లో 6x4) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 113 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో తొలిరోజు ఆసీస్దే పై చేయిగా నిలిచింది. భారత బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకుర్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఇక ఆట ముగిసే సమయానికి కామెరాన్ గ్రీన్(28*; 70 బంతుల్లో 3x4), కెప్టెన్ టిమ్పైన్(38*; 62 బంతుల్లో 5x4) క్రీజులో ఉన్నారు.
భారత్కు శుభారంభం..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(1) తొలి ఓవర్లోనే సిరాజ్ బౌలింగ్లో రోహిత్ చేతికి చిక్కాడు. 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియాకు కాసేపటికే శార్దూల్ ఠాకుర్ మరో షాకిచ్చాడు. ఇంకో ఓపెనర్ మార్కస్ హారిస్(5)ను ఔట్ చేశాడు. అతడు వాషింగ్టన్ సుందర్ చేతికి చిక్కడంతో 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆపై జోడీ కట్టిన స్మిత్(36; 77 బంతుల్లో 5x4), లబుషేన్ మరో వికెట్ పడకుండా తొలి సెషన్ను పూర్తి చేశారు. అప్పటికి ఆసీస్ స్కోర్ 65/2గా నమోదైంది. ఈ క్రమంలోనే భోజన విరామం తర్వాత మూడో వికెట్కు 70 పరుగులు జోడించాక స్మిత్ ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో రోహిత్కు చిక్కడంతో ఆస్ట్రేలియా 87 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయింది.
వేడ్, లబుషేన్ శతక భాగస్వామ్యం..
ఆపై లబుషేన్, వేడ్ మరో కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు శతక భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో సెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. అయితే భారీ స్కోర్ దిశగా సాగుతున్న ఈ జోడీని నటరాజన్ విడదీశాడు. స్వల్ప వ్యవధిలో వారిద్దరినీ ఔట్ చేశాడు. తొలుత జట్టు స్కోర్ 200 వద్ద వేడ్ను పెవిలియన్ పంపిన అతడు కాసేపటికే లబుషేన్ను బోల్తాకొట్టించాడు. దీంతో ఆసీస్ 213 పరగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. అనంతరం గ్రీన్, పైన్ మరో వికెట్ పడకుండా ఆడారు. వీరిద్దరూ 128 బంతులాడి 61 పరుగులు చేశారు. చివరికి మూడు ఓవర్లు ఉండగానే ఆటను నిలిపివేశారు. తొలి రోజు 87 ఓవర్లకు ఆసీస్ 274/5తో నిలిచింది.
ఇవీ చదవండి..
కుల్దీప్ను తీసుకోకపోవడం ఆశ్చర్యం
60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్