IND vs AUS: కొండంత లక్ష్యం ఉఫ్.. తొలి టీ20లో ఆస్ట్రేలియా విజయం
భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
మొహాలి: భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆసీస్ 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. గ్రీన్ (61) అర్ధశతకం చేయగా.. స్టీవెన్ స్మిత్ (35), వేడ్ (45 నాటౌట్) రాణించారు. దీంతో మూడు టీ20ల సిరీస్లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో మ్యాచ్ అక్టోబర్ 23 (శుక్రవారం) నాగ్పుర్ వేదికగా జరగనుంది.
పాండ్య విజృంభణ..
టీమ్ఇండియా భారీ స్కోరు సాధించడానికి ప్రధాన కారణం ముగ్గురు.. స్వల్ప వ్యవధిలో ఓపెనర్ రోహిత్ శర్మ (11)తోపాటు విరాట్ కోహ్లీ (2) ఔటైనప్పటికీ ఈ ఒత్తిడి భారత్ మీద పడనీయకుండా కేఎల్ రాహుల్ (55), సూర్యకుమార్ యాదవ్ (46) చక్కగా ఆడారు. వీరిద్దరూ కలిసి 68 పరుగులు జోడించారు. అయితే మరోసారి భారత శిబిరంలో అలజడి రేగింది. రాహుల్, సూర్యకుమార్, అక్షర్ పటేల్ (6), దినేశ్ కార్తిక్ (6) పెవిలియన్కు చేరారు. అయినప్పటికీ టీమ్ఇండియా స్కోరు 200 దాటిందంటే కారణం హార్దిక్ పాండ్య (71). ఓ పక్క వికెట్లు పడినా.. దూకుడు మాత్రం తగ్గించలేదు. ఆఖర్లో మరీ భీకరంగా ఆడేశాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3, హేజిల్వుడ్ 2, గ్రీన్ ఒక వికెట్ తీశారు.
200 చేసినా కష్టమే..!
మేం బాగా బౌలింగ్ చేశామని అనుకోవడం లేదు. ఇక్కడ 200 పరుగులను డిఫెండ్ చేయొచ్చు. అయితే ఫీల్డింగ్లో మాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. మా బ్యాటర్లు చాలా చక్కగా బ్యాటింగ్ చేశారు. హార్దిక్ అద్భుతంగా ఆడాడు. అయితే బౌలర్లు కాస్త వెనకబడ్డారు. ఇలాంటి మైదానాల్లో ఆడేటప్పుడు రెండొందలు అయినా జాగ్రత్తగా ఉండాల్సిందే. మా బౌలింగ్ విభాగాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్