టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా భారత్‌తో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి టెస్టులో ఘోర పరాజయం అనంతరం రహానె సారథ్యంలో రెండు టెస్టు గెలిచిన భారత్‌.. మూడో టెస్టులో మరింత 

Updated : 07 Jan 2021 04:52 IST

సిడ్నీ: బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా భారత్‌తో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి టెస్టులో ఘోర పరాజయం అనంతరం రహానె సారథ్యంలో రెండు టెస్టు గెలిచిన భారత్‌.. మూడో టెస్టులో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇక మూడో టెస్టులో వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టులోకి వచ్చాడు. ఆసీస్‌తో తొలిరెండు టెస్టుల్లో విఫలమైన మయాంక్‌ అగర్వాల్‌పై వేటు పడింది. ఆరంగేట్ర మ్యచ్‌లో ఫర్వాలేదనిపించిన శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి రోహిత్‌ బ్యాటింగ్‌ ప్రారంభించనున్నాడు. రెండో టెస్టులో గాయంతో మైదానాన్ని వీడిన ఉమేశ్‌యాదవ్‌ స్థానంలో హరియాణా పేసర్‌ నవదీప్‌ సైనీ జట్టులోకి వచ్చాడు. దీంతో సైనీ సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత్‌ తరఫున 299వ ఆటగాడిగా ఆరంగేట్రం చేయనున్నాడు. 


భారత జట్టు: రోహిత్‌, గిల్‌, పుజారా, రహానె, విహారి, పంత్‌, జడేజా, అశ్విన్‌, సైని, సిరాజ్‌, బుమ్రా

ఆస్ట్రేలియా జట్టు: వార్నర్‌, పకోస్కీ, లబుషేన్‌, స్మిత్‌, వేడ్‌, గ్రీన్‌, పైన్‌, కమిన్స్‌, స్టార్క్‌, లైయన్‌, హేజిల్‌వుడ్‌

ఇవీ చదవండి..

చాలా బాధగా ఉంది: రాహుల్‌

ఆకలిగొన్న సింహంలా స్మిత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని