Ind vs ban: టీమ్ఇండియాతో మ్యాచ్.. వేదికలో మార్పు ప్రకటించిన బంగ్లా క్రికెట్ బోర్డు
టీమ్ఇండియాతో జరగనున్న వన్డే మ్యాచ్ వేదికలో మార్పులు చేస్తున్నట్టుగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
ధాకా: ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్లో టీమ్ఇండియా పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా వన్డే, టెస్టు సిరీస్లకు బంగ్లా ఆతిథ్యం ఇస్తోంది. తాజాగా ఈ సిరీస్లో ఒక మ్యాచ్ వేదికను డాకా నుంచి మారుస్తున్నట్లుగా ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. డిసెంబర్ 4, 7, 10 తేదీల్లో వన్డే సిరీస్ జరగనుంది. అందులో చివరి మ్యాచ్ను చిట్టాగాంగ్లోని స్టేడియంకు మార్చింది.
‘‘ఒక్క టెస్టు మ్యాచ్కు మాత్రమే ఎంచుకొన్న చిట్టాగాంగ్ వేదికపై చివరి వన్డేను కూడా జరిపేందుకు నిర్ణయించాం’’ అంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) అధికారి జలాల్ యూనుస్ బుధవారం ప్రకటించాడు. అయితే ఇందుకు కారణాలను వెల్లడించేందుకు నిరాకరించాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. బుధవారం ఆ దేశ ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(బీఎన్పీ) నిరసనలు, ర్యాలీలకు పిలుపునిచ్చింది. రాజధానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చింది. ప్రధాని షేక్ హసీనా రాజీనామాను డిమాండ్ చేస్తూ నెల రోజులుగా దేశవ్యాప్తంగా వారు నిరసనలు చేపట్టారు. ఈనేపథ్యంలో ఆరోజు మ్యాచ్కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా బీఎన్బీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు