Ind vs ban: టీమ్‌ఇండియాతో మ్యాచ్‌.. వేదికలో మార్పు ప్రకటించిన బంగ్లా క్రికెట్‌ బోర్డు

టీమ్ఇండియాతో జరగనున్న వన్డే మ్యాచ్‌ వేదికలో మార్పులు చేస్తున్నట్టుగా బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. 

Published : 24 Nov 2022 02:03 IST

ధాకా: ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్‌లో టీమ్‌ఇండియా పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఐసీసీ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా వన్డే, టెస్టు సిరీస్‌లకు బంగ్లా ఆతిథ్యం ఇస్తోంది. తాజాగా ఈ సిరీస్‌లో ఒక మ్యాచ్‌ వేదికను డాకా నుంచి మారుస్తున్నట్లుగా ఆ దేశ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. డిసెంబర్‌ 4, 7, 10 తేదీల్లో వన్డే సిరీస్‌ జరగనుంది. అందులో చివరి మ్యాచ్‌ను చిట్టాగాంగ్‌లోని స్టేడియంకు మార్చింది. 

‘‘ఒక్క టెస్టు మ్యాచ్‌కు మాత్రమే ఎంచుకొన్న చిట్టాగాంగ్‌ వేదికపై చివరి వన్డేను కూడా జరిపేందుకు నిర్ణయించాం’’ అంటూ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బీసీబీ) అధికారి జలాల్‌ యూనుస్‌ బుధవారం ప్రకటించాడు. అయితే ఇందుకు కారణాలను వెల్లడించేందుకు నిరాకరించాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. బుధవారం ఆ దేశ ప్రతిపక్షమైన బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ(బీఎన్‌పీ) నిరసనలు, ర్యాలీలకు పిలుపునిచ్చింది. రాజధానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చింది. ప్రధాని షేక్‌ హసీనా రాజీనామాను డిమాండ్‌ చేస్తూ నెల రోజులుగా దేశవ్యాప్తంగా వారు నిరసనలు చేపట్టారు. ఈనేపథ్యంలో ఆరోజు మ్యాచ్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా బీఎన్‌బీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని