‘గాయ’పడ్డ కెరీర్లు.. జాగ్రత్త క్రికెటర్లూ!
అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘకాలం కొనసాగడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అత్యుత్తమ ఫిట్నెస్ ప్రమాణాలు పాటించాలి. నిత్యం కసరత్తులు చేయాలి. గాయాలు కాకుండా కాపాడుకోవాలి. సరిపడా విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేశారు కాబట్టే సచిన్ తెందూల్కర్, కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ, రాహుల్ ద్రవిడ్ వంటి క్రికెటర్లు....
ఫిట్నెస్ లేకుంటే మాజీల పరిస్థితే!
అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘకాలం కొనసాగడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అత్యుత్తమ ఫిట్నెస్ ప్రమాణాలు పాటించాలి. నిత్యం కసరత్తులు చేయాలి. గాయాలు కాకుండా కాపాడుకోవాలి. సరిపడా విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేశారు కాబట్టే సచిన్ తెందూల్కర్, కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ, రాహుల్ ద్రవిడ్ వంటి క్రికెటర్లు అన్ని ఫార్మాట్లలోనూ ఎక్కువ మ్యాచులు ఆడగలిగారు. కొందరు ప్రతిభావంతులకు మాత్రం అదృష్టం కలిసిరాలేదు. గాయాల పాలవ్వడంతో కెరీర్ సవ్యంగా సాగడం లేదు. అలాంటి వారిలో బౌలర్లే ఎక్కువ మంది ఉండటం గమనార్హం.
భువి.. వచ్చేదెప్పుడో
టీమ్ఇండియాకు దొరికిన తురుపు ముక్క భువనేశ్వర్ కుమార్. బంతిని రెండువైపులా స్వింగ్ చేసే ఈ యువ పేసర్ ఫిట్నెస్ ఇబ్బందులు, గాయాల వల్ల ఆడాల్సినన్ని మ్యాచులు ఆడలేకపోతున్నాడు. ఎక్కువగా చీలమండ, కాలి మడమ, పిక్కలు, గజ్జల్లో పట్టేయడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. అందుకే 2012లోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినా 21 టెస్టులు, 114 వన్డేలు, 43 టీ20లకే పరిమితం అయ్యాడు. లేదంటే ఈ తొమ్మిదేళ్ల కాలంలో అతడు కనీసం 50 టెస్టుల వరకు ఆడేవాడు. నిజానికి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి చల్లని ప్రదేశాల్లో భువి బౌలింగ్కు ఫిదా అవ్వాల్సిందే.
ప్చ్.. నెహ్రాకూ తప్పలేదు
పద్దెనిమిదేళ్లు అంతర్జాతీయ క్రికెట్లో ఉంటే ఎన్ని టెస్టులు, ఎన్ని వన్డేలు ఆడాలి. ప్చ్..! టీమ్ఇండియా ఒకప్పటి పొడగరి పేసర్ ఆశీష్ నెహ్రాకు ఆ అదృష్టం దక్కలేదు. ఎడమచేతి వాటం పేస్ బౌలింగ్తో మహామహులనే వణికించిన నెహ్రాను గాయాలు తీవ్రంగా వేధించాయి. ఎక్కువగా గజ్జలు, చీలమండ, పిక్క కండరాల గాయంతో బాధపడ్డాడు. అంతేకాకుండా సుదీర్ఘకాలం వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. కీలకమైన పేసర్గా ఎదిగిన అతడు జట్టుకు సేవలందించింది మాత్రం తక్కువే. 17 టెస్టులు, 120 వన్డేలు, 27 టీ20లు మాత్రమే ఆడగలిగాడు. అయితే కీలక మ్యాచుల్లో రాణించాడు.
సాహా.. మారాలిక
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ వికెట్కీపర్ వృద్ధిమాన్ సాహా. ఈ విషయంలో ఎవరికీ సందేహాల్లేవ్. 2010లోనే టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేసిన సాహా కెరీర్లో చాలాకాలం పాటు ఎంఎస్ ధోనీ నీడలోనే ఉండిపోయాడు. మహీకి విశ్రాంతి ఇచ్చినప్పుడు అవకాశాలు దక్కేవి. అతడు సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలికాక రెగ్యులర్ కీపర్గా ఎదిగాడు. ఇప్పటి వరకు 38 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. వికెట్ల వెనక చురుగ్గా కదిలే సాహాకూ గాయాల బెడద తప్పలేదు. మూడేళ్లుగా అతడు గాయాలతో జట్టుకు దూరమవుతున్నాడు. గతంలో మోచేతికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. క్యాచులు అందుకొనేందుకు విపరీతంగా డైవ్ చేసే సాహాకు మోచేతి గాయాలే ఎక్కువ. ఇప్పుడు పంత్ రాకతో పోటీ ఏర్పడింది. ఇకపై ఎన్ని ఆడతాడన్నది సందేహమే!
జాదూ లేదు
టీమ్ఇండియాలో కేదార్ జాదవ్కు అయినన్ని గాయాలు మరెవ్వరికీ అవ్వలేదేమో! ఆల్రౌండర్ కోటాలో ఒక సిరీసుకు ఎంపికవ్వడం.. మధ్యలో గాయపడటం.. మూడు నెలలు జట్టుకు దూరమవ్వడం అన్నట్టుగా ఉండేది అతడి వ్యవహారం. అందుకే ప్రతిభ ఉన్నా.. అవకాశాలు దక్కినా సరైన న్యాయం చేయలేకపోయాడు. చాలా సందర్భాల్లో భుజం, వెన్ను నొప్పి, చీలమండ, గజ్జల్లో గాయాలతో ఇబ్బంది పడ్డాడు. 2014లోనే జట్టులోకి వచ్చినా ఈ కారణాలతోనే కేవలం 73 వన్డేలు, 9 టీ20ల్లో మాత్రమే ఆడాడు. మిడిలార్డర్లో ప్రాధాన్యం ఇచ్చినా అందిపుచ్చుకోలేకపోయాడు. 2019 వన్డే ప్రపంచకప్ ముందు సైతం అతడు గాయపడటం గమనార్హం. ఫిట్నెస్ విషయంలో జాదవ్ అత్యంత పేలవం.
పాండ్య.. జాగ్రత్త
హార్దిక్ పాండ్య.. టీమ్ఇండియా ఎక్స్ ఫ్యాక్టర్. అతనాడితే ఎంత విధ్వంసకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అతడి బౌలింగ్ ఎంత ఉపయోగకరమో, జట్టు కూర్పునకు అతడెంత అవసరమో అందరికీ తెలిసిందే. ఫిట్నెస్ విషయంలో వెనుకాడని పాండ్య గతేడాది సాంతం అంతర్జాతీయ క్రికెట్కు దూరమయ్యాడు. వెన్నుముకకు శస్త్రచికిత్స చేయించుకోవడమే ఇందుకు కారణం. చాన్నాళ్లుగా ఈ యువ ఆల్రౌండర్ వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఆసియాకప్ సమయంలో నొప్పితో విలవిల్లాడటంతో లండన్లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఐపీఎల్ ముందు వరకు అతడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ లీగ్లోనూ బౌలింగ్ చేయలేదు. ఆసీస్ సిరీసులోనూ 4 ఓవర్లు తప్ప బంతి ఇవ్వలేదు. ఇప్పటికీ అతడు బౌలింగ్ ఫిట్నెస్ సాధించనట్టే కనిపిస్తోంది. సుదీర్ఘ భవిష్యత్తు ఉన్న పాండ్య మున్ముందు గాయాల పాలవ్వకుండా చూసుకోవాలి.
మునాఫ్దీ అదే స్థితి
ఒకప్పటి సీనియర్ పేసర్ మునాఫ్ పటేల్దీ అదే పరిస్థితి. 2011 వన్డే ప్రపంచకప్లో కీలక పాత్ర పోషించిన మునాఫ్ స్థాయికి తగినట్టు సుదీర్ఘ కాలం భారత్కు ఆడలేకపోయాడు. పెద్ద వయసు, ఫిట్నెస్ ఇబ్బందులకు తోడు గాయాలు వేధించాయి. తరచూ అతడు కాలిమడమ, వెన్నునొప్పితో బాధపడేవాడు. 13 టెస్టులు, 70 వన్డేలు, 3 టీ20లు ఆడగలిగాడు. టెస్టుల్లో 35, వన్డేల్లో 86, టీ20ల్లో 4 వికెట్లు తీశాడు. జట్టులో ఉన్నంత వరకు అతడికి ప్రాధాన్యం బాగానే దక్కింది.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్