Faf duplessis: గాల్లో తేలినట్టుంది.. ఈరోజు ఎంతో ప్రత్యేకం: డుప్లెసిస్
భారత టీ20 లీగ్ 15వ సీజన్లో బెంగళూరు టీమ్ క్వాలిఫయర్-2కు వెళ్లినందుకు ఆ జట్టు కెప్టెన్ ఫా డుప్లెసిస్ గాల్లో తేలుతున్నాడు...
ఇంటర్నెట్డెస్క్: భారత టీ20 లీగ్ 15వ సీజన్లో బెంగళూరు టీమ్ క్వాలిఫయర్-2కు వెళ్లినందుకు ఆ జట్టు కెప్టెన్ ఫా డుప్లెసిస్ హర్షం వ్యక్తం చేశాడు. గతరాత్రి లఖ్నవూతో జరిగిన కీలకమైన ఎలిమినేటర్-1 మ్యాచ్లో బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో శుక్రవారం రాత్రి ఆ జట్టు రాజస్థాన్తో మరో కీలక పోరులో తలపడనుంది. ఈ విజయంపై స్పందించిన డుప్లెసిస్ ఈ రోజు తనకెంతో ప్రత్యేకమని చెప్పాడు.
‘మా ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. ఈ విజయంతో గాల్లో తేలినట్టుంది. రజత్ పటీదార్ (112 నాటౌట్; 54 బంతుల్లో 12x4, 7x6) లాంటి యువ ఆటగాడు ఇలా రాణించడం జట్టుకు శుభపరిణామం. అతడు శతకం సెలబ్రేట్ చేసుకున్న విధానం చూస్తే ఎలాంటి బాధ్యత తన భుజాలపై మోసాడో అర్థమవుతుంది. ఈ టోర్నీల్లో నేను చూసిన అతి గొప్ప శతకాల్లో ఇదొకటి. స్టేడియం నలువైపులా షాట్లు కొట్టాడు. అతడు దూకుడుగా ఆడిన ప్రతిసారీ ప్రత్యర్థులపై ఒత్తిడి తెస్తాడు. రెండో ఇన్నింగ్స్లో మా బౌలర్లు చాలా ప్రశాంతంగా ఉన్నారు. వారికి ఎలా బౌలింగ్ చేయలనే విషయంపై స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. దీన్ని మేం దీన్ని పెద్ద మ్యాచ్లా భావించలేదు. హర్షల్ మా జట్టులో ప్రత్యేకమైన బౌలర్. అతడు డెత్ ఓవర్లలో ప్రత్యర్థులను దెబ్బతీశాడు. అతడు వేసిన 18వ ఓవర్లోనే ఈ మ్యాచ్ మలుపు తిరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద విజయం సాధించినా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం’ అని డుప్లెసిస్ వివరించాడు.
మా ఓటమికి అదే కారణం: రాహుల్
ఇక ఈ ఓటమితో 15వ సీజన్ నుంచి నిష్క్రమించిన లఖ్నవూ వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగి వస్తామని అంటోంది. ఆ జట్టు సారథి కేఎల్ రాహుల్ మాట్లాడుతూ తమ ఓటమికి ప్రధాన కారణం క్యాచ్లు వదిలేయడమేనని చెప్పాడు. ‘ఫీల్డింగ్ లోపాల వల్లే మేం ఈ మ్యాచ్ ఓడిపోయాం. తేలికైన క్యాచ్లు కూడా వదిలేయడం మంచిది కాదు. మరోవైపు పటీదార్ అద్భుతంగా ఆడాడు. టాప్-3లో ఎవరైనా సెంచరీ కొడితే ఆ జట్టు చాలా వరకు విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే బెంగళూరు మాకన్నా గొప్పగా ఫీల్డింగ్ చేసింది. ఆ విషయంలో మేం తేలిపోయాం. ఇక్కడి నుంచి నిష్క్రమించినా.. ఈ టోర్నీలోని సానుకూల అంశాలను పరిగణలోకి తీసుకుంటాం. మాది కొత్త ఫ్రాంఛైజీ. అయినా, పలు తప్పులు చేశాం. వాటిని సరిదిద్దుకుంటాం. ప్రతి జట్టుకు ఇలాంటివి సహజమే. వాటి నుంచి నేర్చుకొని తిరిగి బలంగా వస్తాం. మా బౌలింగ్లో మోసిన్ ఖాన్ ఎంత నైపుణ్యం ఉన్న ఆటగాడో ఈ సీజన్లో తెలిసొచ్చింది. అతడు మ్యాచ్లు ఆడేకొద్దీ రాటుదేలుతాడు. వచ్చే సీజన్కు మరింత మెరుగవుతాడని ఆశిస్తున్నా’ అని రాహుల్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్