సాయి ప్రణీత్‌ ఔట్‌

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు భమిడిపాటి సాయి ప్రణీత్‌ పోరాటం ముగిసింది.

Published : 04 Feb 2023 02:43 IST

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు భమిడిపాటి సాయి ప్రణీత్‌ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో సాయి ప్రణీత్‌ 17-21, 23-21, 18-21తో ఆరో సీడ్‌ షై ఫెంగ్‌ (చైనా) చేతిలో పోరాడి ఓడాడు. గంటా 24 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో సాయి ప్రణీత్‌ గట్టి పోటీనిచ్చాడు. మూడో గేమ్‌లో 12-18తో ప్రత్యర్థి దాదాపుగా మ్యాచ్‌కు చేరువైనా సాయి ప్రణీత్‌ ఆశలు వదులుకోలేదు. గొప్పగా పుంజుకుని 16-18తో ఫెంగ్‌ను సమీపించాడు. 18-19తో మరింత చేరువయ్యాడు. ఫెంగ్‌ వరుసగా రెండు పాయింట్లతో సాయి ప్రణీత్‌ పోరాటానికి తెరదించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని