MI vs KKR: వెంకీ వంద కొట్టినా.. గెలుపు ముంబయిదే
ఈ సీజన్లో ఆటేమీ బాగోలేదు.. గత మ్యాచ్లో చాలా కష్టపడి గెలిచి బోణీ కొట్టింది. ఎదురుగా బలమైన కోల్కతా.. పైగా 180కిపైగా లక్ష్యం! కానీ ముంబయి బెదరలేదు.. అదిరే ఆటతో కేకేఆర్కు ఝలక్ ఇచ్చింది. పిడుగులా పడిన ఇషాన్.. ఫామ్ అందుకున్న సూర్య కోల్కతాకు చేదు అనుభవాన్ని మిగిల్చారు.
చెలరేగిన ఇషాన్, సూర్య
కోల్కతాకు తప్పని ఓటమి
ముంబయి
ఈ సీజన్లో ఆటేమీ బాగోలేదు.. గత మ్యాచ్లో చాలా కష్టపడి గెలిచి బోణీ కొట్టింది. ఎదురుగా బలమైన కోల్కతా.. పైగా 180కిపైగా లక్ష్యం! కానీ ముంబయి బెదరలేదు.. అదిరే ఆటతో కేకేఆర్కు ఝలక్ ఇచ్చింది. పిడుగులా పడిన ఇషాన్.. ఫామ్ అందుకున్న సూర్య కోల్కతాకు చేదు అనుభవాన్ని మిగిల్చారు. దీంతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వెంకటేశ్ అయ్యర్ సెంచరీ వృథా అయింది. ముంబయికి ఇది వరుసగా రెండో విజయం కాగా.. కోల్కతాకు వరుసగా రెండో ఓటమి. సూర్యకు సారథ్యం అప్పగించిన రోహిత్ శర్మ.. బ్యాటింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలో దిగడం విశేషం. సచిన్ తెందుల్కర్ తనయుడు అర్జున్ ఈ మ్యాచ్తోనే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.
ముంబయి అదరగొట్టింది. ఐపీఎల్-16 తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి.. మూడో మ్యాచ్తో గాడిన పడ్డ ఈ మాజీ ఛాంపియన్.. వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఆదివారం ఆ జట్టు 5 వికెట్ల తేడాతో కోల్కతాను ఓడించింది. మొదట కేకేఆర్ 185/6 స్కోరు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (104; 51 బంతుల్లో 6×4, 9×6) శతకంతో మెరిశాడు. ఛేదనలో ఇషాన్ కిషన్ (58; 25 బంతుల్లో 5×4, 5×6), సూర్యకుమార్ (43; 25 బంతుల్లో 4×4, 3×6) రెచ్చిపోవడంతో ముంబయి 17.4 ఓవర్లలో 5 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
మొదట ఇషాన్.. ఆపై సూర్య: భారీ ఛేదనలో ఆరంభం నుంచి ముంబయి చెలరేగిపోయింది. ఇంపాక్ట్ ప్లేయర్ రోహిత్ (20; 13 బంతుల్లో 1×4, 2×6) అండతో ఇషాన్ కిషన్.. కోల్కతా బౌలర్లను ఉతికి ఆరేశాడు. తొలి ఓవర్లో ఆ జట్టు స్కోరు 2 పరుగులే.. కానీ 4 ఓవర్లకు 57/0తో నిలిచిందంటే కారణం కిషనే. సిక్స్లతో విరుచుకుపడిన అతడు కోల్కతా బౌలింగ్ను చెల్లాచెదురు చేశాడు. ఆ జట్టు తేరుకునేలోపే మ్యాచ్ను ముంబయికి అనుకూలంగా మార్చాడు. కాసేపు మెరిసిన రోహిత్ వెనుదిరిగినా.. ఇషాన్ బాదుడు ఆపలేదు. 21 బంతుల్లోనే అతడి అర్ధశతకం పూర్తపోయింది. అతడికి సూర్య జత కలవడంతో ముంబయి ఎక్కడా తగ్గలేదు. గత కొన్ని ఇన్నింగ్స్ల నుంచి పరుగుల కోసం ఇబ్బంది పడుతున్న సూర్య.. మునుపటిలా చెలరేగాడు. తన శైలిలో 360 డిగ్రీల షాట్లతో స్కోరు బోర్డు పరుగులెత్తించాడు. ఇషాన్ వెనుదిరిగినా.. తిలక్వర్మ (30; 25 బంతుల్లో 3×4, 1×6) సహకారంతో ముంబయిని విజయం దిశగా తీసుకెళ్లాడు. ముఖ్యంగా ఫెర్గూసన్ బౌలింగ్లో ఫైన్ లెగ్ మీదగా నటరాజు పోజులో కొట్టిన సిక్సర్ అద్భుతం. తిలక్ కూడా కొన్ని మెరుపు షాట్లు ఆడడంతో ముంబయి 13 ఓవర్లకు 147/2తో ఎలాంటి ఇబ్బంది లేకుండా దూసుకెళ్లింది. స్వల్ప వ్యవధిలో తిలక్, సూర్య ఔటైనా.. ధాటిగా ఆడిన డేవిడ్ (24 నాటౌట్; 13 బంతుల్లో 1×4, 2×6) మరో 14 బంతులు ఉండగానే జట్టును గెలిపించాడు. కోల్కతా బౌలర్లలో ఇంపాక్ట్ ప్లేయర్ సుయాశ్ (2/27) మాత్రమే రాణించాడు.
వెంకటేశ్ దూకుడు: అంతకుముందు కోల్కతా ఇన్నింగ్స్లో వెంకటేశ్ అయ్యర్ మెరుపులే హైలైట్. ఆరంభంలో జట్టు తడబడినా వెంకటేశ్ నిలబడ్డాడు. అరంగేట్ర పేసర్ అర్జున్ తెందుల్కర్ బౌలింగ్లో సిక్స్తో మొదలు పెట్టిన ఈ లెఫ్ట్హ్యాండర్ ఆ తర్వాత సిక్స్ల జోరు కొనసాగించాడు. క్రీజు వదిలి ముందుకొస్తూ లాంగాన్, లాంగాఫ్ దిశగా బంతిని స్టాండ్స్లోకి పంపిన వెంకటేశ్.. కొన్ని మెరుపు కట్ షాట్లతోనూ పరుగులు రాబట్టాడు. దీంతో పవర్ప్లే ఆఖరికి 57/2తో నిలిచిన కోల్కతా.. ఆ తర్వాతా అదే దూకుడుతో ముందుకెళ్లింది. గత మ్యాచ్లో సర్రైజర్స్పై అదరగొట్టిన కెప్టెన్ నితీష్ రాణా (5) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. వెంకటేశ్ మాత్రం జోరు తగ్గించలేదు. 200 పైన స్ట్రైక్ రేట్తో ఆడుతూ.. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి పంపాడు. 23 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన వెంకటేశ్.. మరో 26 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. ఈ సీజన్లో ఇది రెండో సెంచరీ. కానీ వెంకటేశ్ తప్ప మిగిలిన బ్యాటర్లు దూకుడుగా ఆడకపోవడంతో కోల్కతా 17 ఓవర్లకు 155/4తో నిలిచింది. దీనికి తోడు 18వ ఓవర్లో వెంకటేశ్ ఔటైపోవడంతో కేకేఆర్ ఇబ్బంది పడింది. గత రెండు మ్యాచ్ల్లో మెరిసిన రింకు సింగ్ (18; 18 బంతుల్లో) ధాటికి ఆడలేకపోయాడు. అయితే రసెల్ (21 నాటౌట్; 11 బంతుల్లో 3×4, 1×6) ఆఖర్లో బ్యాట్ ఝుళిపించడంతో కోల్కతా స్కోరు 180 దాటింది. ముంబయి బౌలర్లలో హృతిక్ షోకీన్ (2/34) ఆకట్టుకున్నాడు.
పడి లేచి..
2021 ఐపీఎల్ వరకు వెంకటేశ్ అయ్యర్ ఎవరో అభిమానులకు తెలియదు. కానీ ఈ సీజన్ ఆఖరి కల్లా అతడి సత్తా ఏంటో అందరికీ అర్థమైంది. దూకుడైన బ్యాటింగ్తో పాటు ఉపయుక్తమైన బౌలింగ్తో అదరగొట్టాడతను. ఈ సీజన్లో 10 మ్యాచ్ల్లో 370 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు తీసిన వెంకటేశ్.. భారత జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. కానీ ఏడాది తిరిగేసరికి మొత్తం తలకిందులైంది. 2022 ఐపీఎల్లో ఈ ఆల్రౌండర్ 14 మ్యాచ్లు ఆడి 182 పరుగులే చేశాడు. పైగా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. టీమ్ఇండియాలోనూ చోటు కోల్పోయాడు. దీంతో 2023 సీజన్లో కోల్కతా అతడిని నేరుగా జట్టులోకి తీసుకోలేదు. పంజాజ్తో తొలి మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా దించింది. ఆ మ్యాచ్లో వేగంగా ఆడలేకపోయిన ఆ తర్వాత ఆర్సీబీపై (3) కూడా విఫలమయ్యాడు. ఇంకా అతడికి కష్టమే అనుకుంటున్న సమయంలో గుజరాత్పై ఆడిన మెరుపు ఇన్నింగ్స్ (83; 40 బంతుల్లో) వెంకటేశ్కు ఊపిరి పోసింది. కోల్కతా 200పైన లక్ష్యాన్ని ఛేదించడంలో అతడు కీలకమయ్యాడు. దీంతో అతణ్ని ఆదివారం తుది జట్టులోకే తీసుకుంది కోల్కతా. ముంబయిపై చెలరేగి ఆడిన సెంచరీ చేసిన అతను జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇదే ఊపు కొనసాగిస్తే మళ్లీ టీమ్ఇండియాలోకి కూడా ప్రవేశం దక్కొచ్చు.
అర్జున్ ఎట్టకేలకు..
సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తనయుడు అర్జున్ ఎట్టకేలకు ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. 2021 నుంచి ముంబయి ఇండియన్స్తో ఉంటున్న ఈ ఎడమచేతి వాటం ఫాస్ట్బౌలర్ తొలిసారి బరిలోకి దిగాడు. ఆదివారం కోల్కతా నైడ్రైడర్స్తో మ్యాచ్లో అతడికి తుది జట్టులో చోటు దక్కింది. ముంబయి బౌలింగ్ దాడిని అతడే ఆరంభించాడు. రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్.. 17 పరుగులిచ్చాడు. వికెట్లు తీయలేదు. తొలి ఓవర్లో నాలుగు పరుగులే ఇచ్చి ఆకట్టుకున్న అతడు.. రెండో ఓవర్లో 13 సమర్పించుకున్నాడు. అర్జున్ బౌలింగ్లో వెంకటేశ్ అయ్యర్ వరుసగా 4, 6 కొట్టాడు. ఐపీఎల్ ఆడిన (అది కూడా ఒకే జట్టుకు) తొలి తండ్రీ కొడుకుల ద్వయంగా సచిన్, అర్జున్ ఘనత సాధించారు. సచిన్ 2008 నుంచి 2013 వరకు ముంబయి ఇండియన్స్ తరఫున ఆడాడు.
2
ఐపీఎల్ చరిత్రలో కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడు సెంచరీ చేయడం ఇది రెండోసారి మాత్రమే. 2008 తొలి ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో బ్రెండన్ మెక్కలమ్ విధ్వంసక సెంచరీ సాధించాక మళ్లీ ఇప్పుడు వెంకటేశ్ అయ్యరే మూడంకెల స్కోరును అందుకున్నాడు.
కోల్కతా: గుర్బాజ్ (సి) డువాన్ (బి) చావ్లా 8; జగదీశన్ (సి) షోకీన్ (బి) గ్రీన్ 0; వెంకటేశ్ (సి) డువాన్ (బి) మెరిడిత్ 104; నితీష్ (సి) రమణ్దీప్ (బి) షోకీన్ 5; శార్దూల్ (సి) తిలక్ (బి) షోకీన్ 13; రింకు (సి) వాదెరా (బి) డువాన్ 18; రసెల్ నాటౌట్ 21; నరైన్ నాటౌట్ 2; ఎక్స్టాలు 14 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 185;
వికెట్ల పతనం:1-11, 2-57, 3-73, 4-123, 5-159, 6-172;
బౌలింగ్: అర్జున్ తెందుల్కర్ 2-0-17-0; గ్రీన్ 2-0-20-1; డువాన్ జాన్సన్ 4-0-53-1; చావ్లా 4-0-19-1; హృతిక్ షోకీన్ 4-0-34-2; మెరిడిత్ 4-0-40-1
ముంబయి: రోహిత్ (సి) ఉమేశ్ (బి) సుయాశ్ 20; ఇషాన్ (బి) వరుణ్ 58; సూర్య (సి) గుర్బాజ్ (బి) శార్దూల్ 43; తిలక్ (బి) సుయాశ్ 30; డేవిడ్ నాటౌట్ 24; నేహల్ (సి) గుర్బాజ్ (బి) ఫెర్గూసన్ 6; గ్రీన్ నాటౌట్ 1; ఎక్స్టాలు 4 మొత్తం: (17.4 ఓవర్లలో 5 వికెట్లకు) 186;
వికెట్ల పతనం: 1-65, 2-87, 3-147, 4-176, 5-184;
బౌలింగ్: ఉమేశ్ 2-0-19-0; శార్దూల్ 2-0-25-1; నరైన్ 3-0-41-0; సుయాశ్ 4-0-27-2; వరుణ్ 4-0-38-1; ఫెర్గూసన్ 1.4-0-19-1; రసెల్ 1-0-17-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
ఈ ఐపీఎల్ సీజన్లో తొలిసారి ధోనీ ఔటయ్యాడు. అయితే, అతడు చివరి ఓవర్లో సింగిల్ను తిరస్కరించడంపై నెట్టింట చర్చకు తెర లేచింది. -
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
-
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
-
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్బార్.. ధర, ఫీచర్లివే..!
-
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు