జకో అందుకునేనా?
టెన్నిస్ పురుషుల సింగిల్స్లో అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు.. 23 ట్రోఫీలతో శిఖరాగ్రానికి చేరేందుకు.. నాదల్ లేని ఫ్రెంచ్ ఓపెన్లో జయకేతనం ఎగరేసేందుకు జకోవిచ్ సిద్ధమయ్యాడు.
23వ టైటిలే లక్ష్యం
మహిళల సింగిల్స్లో ఫేవరెట్గా స్వైటెక్
నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్
నాదల్ దూరం
టెన్నిస్ పురుషుల సింగిల్స్లో అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు.. 23 ట్రోఫీలతో శిఖరాగ్రానికి చేరేందుకు.. నాదల్ లేని ఫ్రెంచ్ ఓపెన్లో జయకేతనం ఎగరేసేందుకు జకోవిచ్ సిద్ధమయ్యాడు. ఆదివారం ఆరంభం కానున్న ఫ్రెంచ్ ఓపెన్లో టైటిలే లక్ష్యంగా బరిలో దిగుతున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్లో 16 ఏళ్లలో టైటిల్ నిలబెట్టుకున్న తొలి క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పాలనే ధ్యేయంతో స్వైటెక్ సమరానికి సై అంటోంది.
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్.. ఈ పేరు వినగానే ఎర్రమట్టి కోర్టుపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించే దిగ్గజం రఫెల్ నాదల్ గుర్తుకొస్తాడు. 2005లో ఈ గ్రాండ్స్లామ్లో అరంగేట్రం చేసి.. 2022 వరకు వరుసగా 18 టోర్నీల్లో ఆడి 14 సార్లు విజేతగా నిలిచాడు. కానీ తుంటి గాయంతో ఈ డిఫెండింగ్ ఛాంపియన్ తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్కు దూరమయ్యాడు. ఈ సారి నాదల్ లేని ఫ్రెంచ్ ఓపెన్లో విజేతగా నిలిచి.. అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిళ్ల రికార్డు సొంతం చేసుకోవాలనే పట్టుదలతో నొవాక్ జకోవిచ్ ఉన్నాడు. ప్రస్తుతం చెరో 22 గ్రాండ్స్లామ్ విజయాలతో నాదల్, జకో సమంగా ఉన్నారు. అయితే ఫ్రెంచ్ ఓపెన్లో జకో ఇప్పటివరకూ కేవలం రెండు (2016, 2021) సార్లు మాత్రమే విజేతగా నిలిచాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన జకోకు, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్కు మధ్య స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కారస్ అడ్డుగా మారే ప్రమాదం ఉంది. మరోవైపు రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), నిరుటి రన్నరప్ రూడ్ (నార్వే), సిట్సిపాస్ (గ్రీస్), హోల్గర్ రూనె (డెన్మార్క్), రుబ్లెవ్ (రష్యా), జ్వెరెవ్ (జర్మనీ) కూడా ట్రోఫీ కోసం గట్టిగానే పోరాడనున్నారు.
ఆ ముగ్గురిలో ఎవరో?: మహిళల సింగిల్స్ ట్రోఫీ కోసం పోటీ ప్రధానంగా ఇగా స్వైటెక్ (పోలండ్), సబలెంక (బెలారస్), రిబకినా (కజకిస్థాన్) మధ్య ఉండనుంది. గత నాలుగు గ్రాండ్స్లామ్ టైటిళ్లను ఈ ముగ్గురే పంచుకున్నారు. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్ స్వైటెక్ వరుసగా రెండో సారి ఫ్రెంచ్ ఓపెన్లో విజేతగా నిలిచి.. 2007 (జస్టిన్ హెనిన్) తర్వాత ఆ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలవాలనే పట్టుదలతో ఉంది. 21 ఏళ్ల ఈ ప్రపంచ నంబర్వన్ 2020లోనూ ఫ్రెంచ్ ఓపెన్ను సొంతం చేసుకుంది. వింబుల్డన్ ఛాంపియన్ రిబకినా ఈ ఏడాది రోమ్, ఇండియన్ వెల్స్ టైటిళ్లు గెలిచింది. రెండో సీడ్ సబలెంక కూడా జోరుమీదుంది. గతేడాది రన్నరప్ కోకోగాఫ్, మూడో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా), గార్సియా (ఫ్రాన్స్), జాబెర్ (ట్యూనీసియా), అజరెంకా (బెలారస్) కూడా ట్రోఫీపై కన్నేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్