Hardik Pandya: ఆత్మవిశ్వాసం.. ఒత్తిడిని తట్టుకోవడమే హార్దిక్ ఉన్నతికి కారణం!
గత కొంతకాలంగా టీ20 క్రికెట్లో టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య మిడిలార్డర్లో డేంజరస్గా మారాడు. కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ...
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మ్యాథ్యూ హేడెన్
ఇంటర్నెట్ డెస్క్: గత కొంతకాలంగా టీ20 క్రికెట్లో టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య మిడిలార్డర్లో ప్రమాదకారిగా మారాడు. కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్లు ఆడుతూ జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు. తాజాగా ఆసీస్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లోనూ 71 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అయితే, బౌలింగ్లో కాస్త నిరాశపర్చినా.. బ్యాటింగ్ మాత్రం ధాటిగా చేశాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్య ప్రదర్శనపై ఆసీస్ మాజీ టాప్ ఓపెనర్ మ్యాథ్యూ హేడెన్ అభినందనలు కురింపించాడు. హార్దిక్ బ్యాటింగ్ టెక్నిక్ను మెరుగుపర్చడంలో టీమ్ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నాడు.
గాయం కారణంగా సుదీర్ఘకాలంపాటు ఆటకు దూరమైన హార్దిక్ భారత టీ20 లీగ్లో మాత్రం విజృంభించాడు. గుజరాత్కు లీగ్ టైటిల్ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ‘‘హార్దిక్కు తనపై నమ్మకం ఎక్కువ. అద్భుతమైన ప్రతిభ ఉంది. తనదైన రోజున మ్యాచ్ను గెలిపించగల సత్తా ఉన్న ఆటగాడు. ఇప్పటికే భారత టీ20 లీగ్లో దీనిని నిరూపించుకొన్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగి సూపర్ ఇన్నింగ్స్లు ఆడాడు. క్రికెటర్గా ఎంతో ఎత్తుకు ఎదిగాడు. దీనికి కారణం.. హార్దిక్ ఆత్మవిశ్వాసం. అలాగే పరిస్థితిని చక్కగా అంచనా వేసి దానికి తగ్గట్టు ఆడతాడు. ఒత్తిడి సమయంలోనూ హ్యాండిల్ చేయగల సమర్థుడు’’ అని మ్యాథ్యూ హేడెన్ తెలిపాడు.
బెన్స్టోక్స్తో అప్పుడే పోల్చలేం..
హార్దిక్ పాండ్య అద్భుతమైన ఆటగాడైనప్పటికీ.. ఇప్పుడే ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్తో పోల్చడం సరైంది కాదని పాక్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు. స్టోక్స్ స్థాయికి హార్దిక్ చేరుకొన్నాడా..? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘దానిని ఇప్పుడే అంగీకరించలేను. ఎందుకంటే బెన్స్టోక్స్కు మంచి రికార్డు ఉంది. మెగా టోర్నీల్లో అద్భుతంగా ఆడాడు. పాండ్యకు ఇలాంటిది ఇంకా లేదు. ద్వైపాక్షిక సిరీసుల్లో మాత్రమే ప్రస్తుతం బాగా ఆడుతున్నాడు. అందుకే తొందరపడి వీరిని పోల్చడం సరికాదు’’ అని లతీఫ్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్తా మేనన్
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి