Sports News: శివ్లాల్కు ఆ అర్హతే లేదు: అజ్జూ
బీసీసీఐలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ప్రతినిధిగా ఉండేందుకు శివ్లాల్ యాదవ్కు అర్హత లేదని హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ అన్నాడు. అలాంటి వ్యక్తిని హెచ్సీఏ ప్రతినిధిగా బీసీసీఐ...
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: బీసీసీఐలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ప్రతినిధిగా ఉండేందుకు శివ్లాల్ యాదవ్కు అర్హత లేదని హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ అన్నాడు. అలాంటి వ్యక్తిని హెచ్సీఏ ప్రతినిధిగా బీసీసీఐ ఈ నెల 29న నిర్వహించే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు అనుమతించాలని కార్యదర్శి విజయానంద్ కోరడం హాస్యాస్పదంగా ఉందని చెప్పాడు. ‘‘హెచ్సీఏ 85వ ఏజీఎమ్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం బీసీసీఐలో దాని ప్రతినిధిగా శివ్లాల్ యాదవ్ను ఎంపిక చేసినట్లు కార్యదర్శి పత్రిక ప్రకటనలో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. క్రికెట్ వర్గాల్లో సీనియర్ అయిన శివ్లాల్పై ఉన్న గౌరవంతో ఇప్పటికే అతను హెచ్సీఏ అధికారిగా మొత్తం 17 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నాడని స్పష్టం చేస్తున్నా. 1992 నుంచి 2000 వరకు సంయుక్త కార్యదర్శిగా, 2000 నుంచి 2008 వరకు కార్యదర్శిగా పని చేశాడు. హెచ్సీఏ వెబ్సైట్లో, ఉప్పల్లోని దాని కార్యాలయంలో ఈ సమాచారం ఉంది. నియమావళి ప్రకారం ఓ వ్యక్తి ఓ రాష్ట్ర క్రికెట్ సంఘంలో లేదా బీసీసీఐలో అధికార ప్రతినిధిగా మొత్తం 9 ఏళ్ల పాటు కొనసాగితే అతను బీసీసీఐ ప్రతినిధిగా ఉండేందుకు అర్హత కోల్పోతాడు. ఈ నిబంధన ప్రకారం శివ్లాల్ అనర్హుడు. అతని అర్హత విషయంతోనే నాకు సమస్య. ఆ బాధ్యత చేపట్టగలిగే ఎంతో మంది సమర్థులు మన చుట్టూ ఉన్నారు’’ అని శనివారం ఓ పత్రిక ప్రకటనలో అజహరుద్దీన్ పేర్కొన్నాడు. మరోవైపు సీఈవో ఎంపికలో పారదర్శకత పాటించకుండా ఇష్టమొచ్చిన రీతిలో అపెక్స్ కౌన్సిల్ పేరు చెప్పి సునీల్ కంటేను ఆ పదవిలో నియమించామనడం సరికాదని అజహరుద్దీన్ అన్నాడు. సీఈవో ఎంపిక ప్రక్రియపై విచారణ చేయాలని బీసీసీఐకి లేఖ రాస్తానని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్