ICC : పురుషులు, మహిళల ప్రైజ్మనీలో తేడాపై చర్చిస్తున్నాం: ఐసీసీ సీఈవో
ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో పురుషుల, మహిళల జట్లకు...
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో పురుషులు, మహిళల జట్లకు అందించే ప్రైజ్మనీలో ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు చర్చలు జరుగుతున్నాయని అంతర్జాతీయ క్రికెట్ మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గెఫ్ అలార్డెస్ తెలిపారు. ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రపంచకప్లో విజేతకు 1.32 మిలియన్ డాలర్ల ప్రైజ్మనీ అందనుంది. ఇది 2019 పురుషుల వరల్డ్కప్ ఛాంపియన్కు దక్కిన ప్రైజ్మనీలో (4.8 మిలియన్ డాలర్లు) మూడో వంతు కావడం గమనార్హం. ఈ క్రమంలో 2024-2032 వరకు జరిగే పురుషుల, మహిళల ఈవెంట్లకు సంబంధించి ప్రైజ్మనీని సమానంగా అందించేందుకు అపెక్స్ కమిటీ చర్చించిందని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు.
‘‘ప్రైజ్మనీ అంశంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నాం. అంతేకాకుండా మహిళల ప్రస్తుతం ఎనిమిది జట్లతో జరుగుతున్న ప్రపంచకప్లో మరో రెండింటిని చేర్చడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. 2029 నాటికి పది జట్లతో ప్రపంచకప్ను నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎనిమిది మంది తల్లులు వరల్డ్ కప్ పోటీల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. పోటీతత్వం పెరగడం ఆహ్వానించదగిన విషయం. దీనికి తగ్గట్టుగా వారికి సదుపాయాలు కల్పించాం’’ అని గెఫ్ అలార్డెస్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్, సాటార్త్వైట్ (కివీస్), లీ తహుహు (కివీస్), మెగన్ ష్కుట్ (ఆసీస్), రాచీల్ హైన్స్ (ఆసీస్), లీజెల్లె లీ (దక్షిణాఫ్రికా), మసబాట క్లాస్ (దక్షిణాఫ్రికా), ఫ్లెచర్ (విండీస్) క్రికెటర్లు పిల్లలకు జన్మనిచ్చాక కూడా ప్రపంచ కప్లో ఆడటం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
-
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం
-
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్!
-
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
-
ఓటర్ స్లిప్ చూపించు.. రూ.3 వేలు తీసుకో..! జోరుగా వైకాపా నగదు పంపిణీ
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన