అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది.
సైబర్ నేరాల నియంత్రణకు ఆర్బీఐ చర్యలు
మూణ్నెల్లలోనే 2.5 లక్షల బ్యాంకు ఎకౌంట్ల మూసివేత
ఇతరులు వినియోగించుకునేందుకు అనుమతిస్తే చిక్కులు తప్పవంటున్న దర్యాప్తు సంస్థలు
ఈనాడు - హైదరాబాద్: అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోని ఈ తరహా 2.5 లక్షల ఖాతాలను 3 నెలల కాలంలోనే రద్దుచేశారు.
ఎక్కడో ఉండి.. ఇక్కడి ఖాతాలకు..
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. ఒక్క తెలంగాణలోనే సైబర్ నేరాల వల్ల గత ఆర్థిక సంవత్సరంలో బాధితులు రూ.2 వేల కోట్లు పోగొట్టుకున్నారు. దేశవ్యాప్తంగా లెక్కలేస్తే ఈ మొత్తం రూ.15-20 వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్మును మళ్లించుకునేందుకు అమాయకుల బ్యాంకు ఖాతాలను వినియోగించుకుంటున్నారు. నిరుద్యోగులు, చిరు వ్యాపారులు, రైతు కూలీలకు కమీషన్ ఆశ చూపి..వారి ఖాతాల వివరాలు తీసుకుంటున్నారు. వారితో ఖాతాలు తెరిపించేందుకు స్థానికంగా ఏజెంట్లనూ నియమించుకుంటున్నారు. కొల్లగొట్టిన డబ్బును తొలుత వీరి ఖాతాల్లోకి, అక్కడ నుంచి మరికొన్ని ఖాతాల్లోకి మళ్లించి..తర్వాత ఈ సొమ్మును క్రిప్టోగా మార్చి విదేశాలకు తరలిస్తున్నారు.
కట్టడికి కఠిన చర్యలు
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు వ్యవస్థీకృతమయ్యాయి. కొందరు విదేశాల నుంచీ కార్యకలాపాలు సాగిస్తుండటంతో వారిని పట్టుకోవడం, నేరాలు జరగకుండా అడ్డుకోవడం దర్యాప్తు సంస్థలకు సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో నేరగాళ్లకు ఆయువు పట్టులాంటి బ్యాంకు ఖాతాల ఆటకట్టించాలని దర్యాప్తు సంస్థలు నిర్ణయించాయి. దర్యాప్తు సంస్థలు ఇచ్చిన సూచనల ఆధారంగా ఆర్బీఐ అనుమానాస్పద ఖాతాల రద్దుకు బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ ప్రకారం..పెద్దగా లావాదేవీలు జరగని ఖాతాల్లోకి ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బు జమకావడం, ఆ వెంటనే ఆ డబ్బు వేరే ఖాతాలోకి మళ్లడం వంటివి జరిగినప్పుడు దాన్ని అనుమానాస్పద ఖాతాగా పరిగణిస్తారు. ఆ ఖాతాదారుడిని పిలిచి విచారిస్తారు. అంత సొమ్ము ఎలా వచ్చింది? ఎవరు పంపారు? అక్కణ్నుంచి మరో ఖాతాలోకి ఎలా వెళ్లిందనే వివరాలు ఆరా తీస్తారు. సరైన సమాధానం లభించకపోతే.. అనుమానాస్పద ఖాతాగానే పరిగణించి రద్దు చేస్తారు. క్రిమినల్ కేసులూ నమోదు చేస్తారు. ఇలా ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 2.5 లక్షల బ్యాంకు ఖాతాలు రద్దయ్యాయి. ‘ఈ ప్రయోగం సత్ఫలితాన్నిస్తోంది. తెలిసి చేసినా, తెలియక చేసినా తమ ఖాతాను వేరే వాళ్లు వాడుకోవడానికి అనుమతిస్తే చిక్కులు తప్పవనే విషయం సామాన్య ఖాతాదారులకు కూడా తెలిసివస్తుంది. దీనివల్ల సైబర్ నేరగాళ్ల ముందరి కాళ్లకు బంధాలు వేసినట్లవుతుందని’ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అనుమానాస్పద సిమ్కార్డులు రద్దు చేయిస్తున్నారు. నేరాలకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న 33,029 సిమ్కార్డులు, ఐఎంఈఐ నంబర్ ఆధారంగా 3,769 సెల్ఫోన్లను స్తంభింపజేశారు.
ఆశపడితే నేరస్థులవుతారు
సైబర్ నేరగాళ్లు తాము చేసే నేరాల ద్వారా కొల్లగొట్టే నగదు లావాదేవీల కోసం ఇతరుల బ్యాంకు ఖాతాలను వినియోగించడం ఇటీవల ఎక్కువైంది. నేరానికి ఉపయోగిస్తారని తెలిసినా కొందరు సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆలోచనతో వివరాలు ఇస్తున్నారు. అలా ఇచ్చే వారూ నేరస్థులే అవుతారు. నేరాలు చేసే వారికి సిమ్కార్డులు ఇచ్చినా నేరస్థులుగానే పరిగణిస్తాం.
కొత్తపల్లి నరసింహ, డీసీపీ, సైబరాబాద్ సైబర్క్రైమ్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో పట్టణ రాష్ట్రంగా తెలంగాణ
పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అనుకూలమైన వాతావరణం, మంచి నీటి వసతి, నిరంతర విద్యుత్తు సరఫరా, శాంతిభద్రతలు, స్నేహపూర్వక ప్రభుత్వం కారణంగా హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోందని చెప్పారు. -
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..
భారతదేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోని నికోబార్ దీవులపైకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. -
నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం
రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. -
తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు... కల్తీ మసాలాలు.. మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు.. అపరిశుభ్రమైన వంటశాలలు.. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్క్రీం పార్లర్లు, కాఫీ షాప్లలో పరిస్థితి ఇది. -
ఆశతో పెట్టుబడి.. మోసాలకు పట్టుబడి
రూ.వెయ్యి పెడితే రూ.10 వేలు, రూ.లక్ష పెడితే రూ.10 లక్షల లాభం చూపిస్తామంటే ఎవరికైనా ఒకసారి ప్రయత్నిద్దామని ఆశ పుడుతుంది. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
మత్తు అనర్థాలపై అవగాహన: ఐఎంఏ
మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. తెలంగాణ రాష్ట్ర మానసిక ఆరోగ్య కమిటీ ప్రకటించింది. -
తగ్గిన గనులశాఖ ఆదాయం
రాష్ట్రంలో గనుల శాఖకు 2023-24లో రూ.5,439.93 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సగానికిపైగా బొగ్గు ద్వారానే వచ్చింది. కాగా ఇసుక ఆదాయ లక్ష్యసాధనలో గనులశాఖ వెనుకబడింది. -
తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి
రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రెండు, మూడు నెలల్లో… బీబీనగర్-గుంటూరు డబ్లింగ్ పనులు
తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్-గుంటూరు రెండో లైన్ పనులు రెండు, మూడు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. -
జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల
బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం విడుదల చేసింది. -
థింపూలో ఏబీటీవో కార్యాలయం ప్రారంభం
భూటాన్ రాజధాని థింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్ల (ఏబీటీవో) కార్యాలయం ఆదివారం ప్రారంభమైంది. -
29, 30 తేదీల్లో వనదేవతల గద్దెలకు తాళాలు
మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో మూసివేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు. -
నేటి నుంచే ‘టెట్’
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సోమవారం ప్రారంభం కానుంది. జూన్ 2వరకు జరిగే ఈ పరీక్ష మొదటి పేపర్కు 99,958 మంది, రెండో పేపర్కు 1,86,428 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
నేటి నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు
యాదాద్రి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి 22 వరకు నారసింహుడి వార్షిక జయంతి మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
‘మత్తు’ నియంత్రణకు కదిలిన యంత్రాంగం
రాష్ట్రంలో నాటుసారాను మూడు నెలల్లో నిర్మూలించడంతోపాటు గంజాయిని నియంత్రించాలనే లక్ష్యంలో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాచరణ ప్రారంభించింది. -
వాతావరణ మార్పులతో ‘ఆర్థిక విధ్వంసం’
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఊహించిన దానికన్నా ఆరు రెట్లు ఎక్కువగా విధ్వంసం ఉందని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. -
ప్రమాదంలో భావప్రకటన స్వేచ్ఛ
దేశంలో భావప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా.ఎస్.మురళీధర్ అన్నారు. -
ముంచుకొచ్చిన వానలు.. మొలకెత్తిన వడ్లు
ములుగు జిల్లా వెంకటాపూర్లోని కొనుగోలు కేంద్రంలో సన్న ధాన్యం ఆరబోయగా మొత్తం ఇలా మొలకెత్తాయి. జిల్లా రైతాంగాన్ని పది రోజులుగా అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. -
ఆధార్ అనుసంధానం కాకున్నా..‘డెత్ క్లెయిమ్’లు పరిష్కరించండి
ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానం కాకుండా చనిపోయిన చందాదారుల క్లెయిమ్లు పరిష్కరించేందుకు ఈపీఎఫ్వో వెసులుబాటు కల్పించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల