IND vs ENG: వర్షంతో ఆటకు అంతరాయం.. ఇంగ్లాండ్‌ 3 ఓవర్లకు 16/1

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటయ్యాక ఇంగ్లాండ్‌...

Published : 02 Jul 2022 16:49 IST

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటయ్యాక ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించింది. అలెక్స్‌ లీస్‌ (6), జాక్‌ క్రాలే (7) ఓపెనర్లుగా వచ్చారు. అయితే, బుమ్రా వేసిన మూడో ఓవర్ చివరి బంతికి లీస్‌ బౌల్డయ్యాడు. దీంతో ఇంగ్లాండ్‌ 16 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం ఓలీపోప్‌ క్రీజులోకి రాగానే వర్షం కురవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు.  ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 400 పరుగుల వెనుకంజలో నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు