IND vs PAK: వన్డే ఫార్మాట్లో ఆసియా కప్ - 2023.. మరోసారి ఒకే గ్రూప్లో దాయాదులు
ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు లేనప్పటికీ.. భారత్ X పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్లను చూసేందుకు అభిమానులకు అవకాశం వస్తూనే ఉంది. విజయం కోసం ఇరు జట్ల పోరాటం కూడా ఫ్యాన్స్ను ఖుషీ చేస్తోంది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ టోర్నీకి (ODI World Cup 2023) ముందే మరోసారి దాయాదుల పోరును వీక్షించొచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ - పాక్ (IND vs PAK) మధ్య మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూసే అభిమానులకు బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా (Jay Shah) శుభవార్త తెలిపారు. గత టీ20 ప్రపంచకప్లో ఒకే గ్రూప్లో పోటీ పడిన ఇరు జట్లూ మరోసారి తలపడేందుకు సిద్ధం కావడం విశేషం. అయితే, ఈసారి మాత్రం ఆసియా కప్లో (Asia Cup 2023) పోటీపడనుండటం విశేషం. ఈ మేరకు పురుషుల ఆసియా కప్ 2023, మహిళల ఆసియా కప్ 2024 గ్రూప్ల వివరాలను జై షా ప్రకటించారు. రెండేళ్లపాటు ఆసియా క్రికెట్ క్యాలెండర్, అండర్ -16, అండర్ - 19, ఎమర్జింగ్ టీమ్స్ (ఏ జట్లు), సీనియర్ పురుషులు, మహిళా జట్లకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు.
‘‘ఆసియా క్రికెట్ 2023, 2024కి సంబంధించి ఏసీసీ క్రికెట్ క్యాలెండర్లను ప్రకటించాం. ఇక్కడ క్రికెట్ను మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం. ఆసియా దేశాల క్రికెటర్లు అద్భుతమైన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. క్రికెట్ను ఎంజాయ్ చేయడానికి సరైన సమయంగా భావిస్తున్నాం’’ అని జైషా ట్వీట్ చేశారు. ఏసీసీ విడుదల చేసిన క్రికెట్ క్యాలెండర్ ప్రకారం.. 2023లో మెన్స్ ఆసియా కప్ (ODI), 2024లో మహిళల ఆసియా కప్ (T20) జరుగుతాయి.
(ఫొటో సోర్స్: ఏసీసీ ట్విటర్)
గతేడాది టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్ పోటీలను ఈసారి మాత్రం వన్డే ఫార్మాట్లో ఏసీసీ నిర్వహించనుంది. పురుషుల ఆసియా కప్ 2023 (Asia Cup) సెప్టెంబర్ నెలలో ఉంటుంది. అయితే తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఆరు జట్లు తలపడే ఈ టోర్నీలో రెండు గ్రూపులు ఉంటాయి. ఒక గ్రూపులో భారత్, పాక్తోపాటు (IND vs PAK) క్వాలిఫయర్ జట్టు ఒకటి ఉంటుంది. మరో గ్రూప్లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ ఉన్నాయి. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఏసీసీ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఇక మహిళల ఆసియా కప్ 2024లోనూ భారత్, పాక్ ఒకే గ్రూప్లో ఉంటాయి. అయితే టీ20 ఫార్మాట్లో ఈ పోటీలు జరుగుతాయి.
(ఫొటో సోర్స్: ఏసీసీ ట్విటర్)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం