Kohli - Rohit: పింక్బాల్ టెస్టులో కోహ్లీ-రోహిత్ ఎలా ఆడుతారో!
టీమ్ఇండియా శనివారం నుంచి శ్రీలంకతో ఆడే రెండో టెస్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్.. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలా ఆడతారనేది ఆసక్తిగా మారింది...
డే/నైట్ టెస్టుల్లో కోహ్లీనే టాప్ స్కోరర్
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా శనివారం నుంచి శ్రీలంకతో ఆడే రెండో టెస్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్.. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలా ఆడతారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు భారత్ ఆడిన మూడు పింక్బాల్ టెస్టుల్లో కోహ్లీనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతడు ఆడిన మూడు డే/నైట్ టెస్టుల్లో 60.25 మెరుగైన సగటుతో 241 పరుగులు చేశాడు. దీంతో ఈ జాబితాలో అందరికన్నా ముందున్నాడు. తర్వాత రోహిత్ రెండు టెస్టుల్లో 112 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి ప్రారంభమయ్యే మరో పింక్బాల్ టెస్టులో వీరిద్దరు ఎలా ఆడతారనేది కీలకం కానుంది.
కాగా, పింక్బాల్ టెస్టుల్లో టీమ్ఇండియా తరఫున కోహ్లీనే శతకం సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. అతడు 2019లో కోల్కతా వేదికగా నవంబర్లో బంగ్లాదేశ్తో జరిగిన తొలి పింక్ బాల్ టెస్టులోనే శతకం సాధించాడు. తర్వాత మరో మూడంకెల స్కోర్ చేయకపోవడం గమనార్హం. దీంతో మాజీ సారథికి అదే చివరి శతకంగా మారింది. దీంతో అప్పటి నుంచీ ఎంత బాగా ఆడినా విరాట్ మరో సెంచరీ చేయలేకపోయాడు. ఇక ఇటీవల మొహాలి వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ 45 పరుగులతో ఆకట్టుకున్నా.. చివరికి అర్ధశతకం ముందు ఔటయ్యాడు. దీంతో వందో టెస్టులోనైనా శతకం సాధిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. అయితే, విరాట్ రేపటి నుంచి లంకతో ప్రారంభమయ్యే రెండో టెస్టులో మరో 25 పరుగులు సాధిస్తే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మార్క్వా, గ్యారీ సోబర్స్లను వెనక్కినెడుతాడు.
ఇక రోహిత్ శర్మ గతేడాది అహ్మదాబాద్లో ఇంగ్లాండ్తో జరిగిన పింక్బాల్ టెస్టులో 66 పరుగులతో రాణించాడు. అతడు కూడా ఈ లంకతో జరిగే రెండో మ్యాచ్లో బ్యాట్ ఝుళిపిస్తే భారీ పరుగులు చేసే అవకాశం ఉంది. దీంతో పింక్బాల్ టెస్టుల్లో కోహ్లీని అధిగమించి అత్యధిక పరుగులు చేసే వీలుంది. అతడి అభిమానులు సైతం ఇదే ఆశిస్తున్నారు. మరోవైపు బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ ఒకే ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేస్తే స్పిన్ దిగ్గజం అనిల్కుంబ్లేకు చెందిన ఓ అరుదైన రికార్డును సమం చేస్తాడు. గత మ్యాచ్లో అతడు టీమ్ఇండియా తరఫున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన జాబితాలో కపిల్ దేవ్ (434)ను అధిగమించి రెండో స్థానానికి చేరుకొన్న చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాబోయే మ్యాచ్లోనూ మరోసారి బంతితో మాయ చేస్తే భారత్లో అత్యధికసార్లు ఐదు వికెట్లు సాధించిన కుంబ్లే (25) సరసన నిలుస్తాడు. అదే రెండు ఇన్నింగ్స్ల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేస్తే కుంబ్లేనే అధిగమించి కొత్త చరిత్ర సృష్టిస్తాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
-
మేనత్తను అవమానిస్తే ఆనందిస్తారా?: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై డీకే అరుణ ఫైర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జైలుకు పోతానన్న భయంతో జగన్ లండన్కు: సీఎం రమేశ్