లబుషేన్‌ను బోల్తా కొట్టించిన జడేజా

బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడో వికెట్‌ కోల్పోయింది. సెంచరీ వైపు దూసుకెళ్తున్న లబుషేన్‌ను(91: 196 బంతుల్లో) రవీంద్ర జడేజా బోల్తా కొట్టించాడు. ఓ చక్కటి బంతికి లబుషేన్‌ స్లిప్‌లో 

Updated : 08 Jan 2021 06:07 IST

సిడ్నీ: బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడో వికెట్‌ కోల్పోయింది. సెంచరీ వైపు దూసుకెళ్తున్న లబుషేన్‌ను(91: 196 బంతుల్లో) రవీంద్ర జడేజా బోల్తా కొట్టించాడు. ఓ చక్కటి బంతికి లబుషేన్‌ స్లిప్‌లో రహానెకు చిక్కాడు. దీంతో 100 పరుగుల భాగస్వామ్యానికి జడేజా తెరదించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. స్మిత్‌ (52) అర్ధశతకం చేశాడు. ప్రస్తుతం క్రీజులో స్మిత్‌, వేడ్‌ ఉన్నారు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 166/2తో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు స్కోరు 188/2 పరుగుల వద్ద వర్షం ప్రారంభం కావడంతో అంపైర్లు ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. వర్షం ఆగిపోవడంతో ఆట మళ్లీ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రమాదకరంగా మారిన లబుషేన్‌ ఔట్‌ కావడంతో భారత్‌ కాస్త ఊపిరిపీల్చుకుంది.  

ఇవీ చదవండి..

పంత్‌.. అదే వరస

కుర్రాడు.. అడ్డుపడ్డాడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని