IND vs SA: రాణించిన శ్రేయస్‌, ఇషాన్‌.. సౌతాఫ్రికా లక్ష్యం ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్‌ బ్యాటింగ్‌ ముగిసింది. శ్రేయస్‌ అయ్యర్ (40; 35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (34; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది.

Published : 12 Jun 2022 20:49 IST

కటక్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్‌ బ్యాటింగ్‌ ముగిసింది. శ్రేయస్‌ అయ్యర్ (40; 35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (34; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (1) మరోసారి నిరాశపర్చాడు. గత మ్యాచ్‌లో మెరిసిన రిషభ్‌ పంత్‌ (5), హార్దిక్‌ పాండ్య (9) విఫలమయ్యారు. అక్షర్‌ పటేల్‌ 10 పరుగులు చేశాడు. దినేశ్‌ కార్తీక్ (30*) చివర్లో కాస్త దూకుడుగా ఆడాడు. హర్షల్ పటేల్‌ (12*) నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఆన్రిచ్‌ నార్జ్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. కగిసో రబాడ, పార్నెల్‌, ప్రిటోరియస్, కేశవ్‌ మహరాజ్‌ తలో వికెట్‌ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని