IND vs SL: మూడో వన్డేలో భారత్ విజయం.. ఎన్ని రికార్డులు నమోదయ్యాయో!
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ను భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు కొత్త రికార్డులు నమోదు అయ్యాయి. వాటిపై ఓలుక్కేద్దాం..!
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ని టీమ్ఇండియా 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగుల భారీ స్కోరు చేయగా, శ్రీలంక 22 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. గాయం కారణంగా అషెన్ వాండర్సే బ్యాటింగ్ చేయలేదు. మరి ఈ మ్యాచ్లో నమోదైన పలు రికార్డులపై ఓ లుక్కేద్దాం.
- 21: ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ (166; 110 బంతుల్లో) భారీ శతకం బాదాడు. ఈ క్రమంలో స్వదేశంలో అత్యధిక సెంచరీలు (21) బాదిన బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. ఇన్నాళ్లూ ఈ రికార్డు సచిన్ (20) పేరిట ఉంది.
- 166: వన్డేల్లో కోహ్లీకిది రెండో అత్యధిక స్కోరు. 2012 ఆసియా కప్లో పాకిస్థాన్పై 183 పరుగులు అతడి అత్యధిక స్కోరు.
- 10: వన్డేల్లో శ్రీలంకపై కోహ్లీకిది 10వ సెంచరీ. ఈ శతకంతో వన్డేల్లో ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా అవతరించాడు. సచిన్ (వెస్టిండీస్పై 9) రెండో స్థానంలో ఉన్నాడు.
- 317: వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే (317) భారీ విజయం. (ఐర్లాండ్పై 290) న్యూజిలాండ్ పేరిట ఉన్న రికార్డును భారత్ అధిగమించింది.
- (4/32): ఈ మ్యాచ్లో టీమ్ఇండియా బౌలర్ సిరాజ్ (4/32) ఆకట్టుకున్నాడు. వన్డేల్లో అతడి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే.
- 5: ప్రస్తుతం వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ (12,574) ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో మహేల జయవర్ధనే (12650)ను అధిగమించాడు.
- 73: వన్డేల్లో శ్రీలంకకు ఇది (73) నాలుగో అత్యల్ప స్కోరు.
- 2: ఈ ఫార్మాట్లో వేగవంతమైన (106 బంతుల్లో) 150 అందుకున్న రెండో భారత ఆటగాడిగా నిలిచాడు కోహ్లీ. ఇషాన్ కిషన్ (103 బంతుల్లో బంగ్లాదేశ్పై) తొలి స్థానంలో ఉన్నాడు.
- 8: ఈ మ్యాచ్లో కోహ్లీ 8 సిక్స్లు బాదాడు. వన్డేల్లో ఓ ఇన్నింగ్స్లో అతడి అత్యధిక సిక్స్లు ఇవే.
- 4: 50 ఓవర్ల ఫార్మాట్లో శ్రీలంకపై భారత్ నాలుగో (390/5) అత్యధిక స్కోరు ఇది.
- 3: శ్రీలంక ఆటగాడు అవిష్క ఫెర్నాండో ఈ సిరీస్లో మూడు సార్లు మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లోనే ఔటయ్యాడు.
- 10: అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్లు అందుకున్న ఆటగాళ్లలో కోహ్లీ(10) మూడో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో సచిన్(15), రెండో స్థానంలో శ్రీలంక ఆటగాడు సనత్ జయసూర్య(11) కొనసాగుతున్నాడు. కోహ్లీ కేవలం 66 సిరీస్ల్లోనే ఈ ఘనత సాధించాడు.
- 5: వన్డేల్లో 150కి పైగా స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్లలో సచిన్, గేల్తో కలిసి కోహ్లీ(5) మూడోస్థానంలో నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో రోహిత్(8), డేవిడ్ వార్నర్(6) స్థానాల్లో ఉన్నారు.
- 21: ఈ ఫార్మాట్లో శ్రీలంకపై అత్యధిక అర్ధసెంచరీలు చేసిన వ్యక్తుల్లో ధోనీతో కలిసి కోహ్లీ(21) రెండో స్థానంలో నిలిచాడు. తొలిస్థానంలో సచిన్(25) ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.