Asia cup 2023 winner: ఆసియా కప్ విజేత టీమ్ ఇండియా
వన్డే ప్రపంచకప్ ముందు టీమ్ఇండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. శ్రీలంక వేదికగా జరిగిన ఆసియాకప్-2023ను సొంతం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ ముందు టీమ్ఇండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. శ్రీలంక వేదికగా జరిగిన ఆసియాకప్-2023ను సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య జట్టు శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఎనిమిదోసారి ఆసియాకప్ను దక్కించుకుంది. భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ (6/21) శ్రీలంక బ్యాటింగ్ వెన్ను విరగొట్టిన వేళ 50 పరుగులకే లంకేయులు కుప్పకూలారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఓపెనర్లు శుభ్మన్ గిల్ (27*; 19 బంతుల్లో 6 ఫోర్లు), ఇషాన్ కిషన్ (23*; 18 బంతుల్లో 3 ఫోర్లు) వికెట్ కోల్పోకుండా భారత్ను విజయ తీరాలకు చేర్చారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక.. భారత బౌలర్ల దెబ్బకు 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. టీమ్ఇండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ (6/21) ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ కొట్టాడు. ఇదే క్రమంలో వన్డేల్లో తన అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. ఆసియా కప్లో అతడికిదే బెస్ట్ బౌలింగ్ కావడం విశేషం. శ్రీలంక ఇన్నింగ్స్లో కుశాల్ మెండిస్ (17) టాప్ స్కోరర్ కావడం గమనార్హం. ఐదుగురు బ్యాటర్లు డకౌట్గా పెవిలియన్కు చేరారు. కుశాల్ పెరీరా, సదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ, డాసున్ శనక, పతిరన పరుగులేమీ చేయలేదు. మిగిలినవారిలో పాథుమ్ నిశాంక (2), ధనంజయ డిసిల్వా (4), దునిత్ వెల్లలాగె (8) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. చివర్లో దుషాన్ హేమంత (13*) కాస్త పరుగులు చేయడంతో శ్రీలంక స్కోరు ఆమాత్రమైనా చేయగలిగింది. దీంతో భారత్ ఎదుట 51 పరుగుల స్వల్ప లక్ష్యం మాత్రమే ఉంది. సిరాజ్ 6 వికెట్లు.. హార్దిక్ పాండ్య మూడు, బుమ్రా ఒక వికెట్ తీశారు.
మరిన్ని రికార్డులు..
- రోహిత్ శర్మ సారథ్యంలో భారత్కిది రెండో టైటిల్. 2018లోనూ (బంగ్లాదేశ్తో ఫైనల్) హిట్మ్యాన్ కెప్టెన్సీలో టీమ్ఇండియా ఆసియా కప్ సాధించింది.
- భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్ సిరాజ్. అతడి కంటే ముందు స్టువర్ట్ బిన్నీ (6/4), అనిల్ కుంబ్లే (6/12), బుమ్రా (6/19) ఉన్నారు.
- వన్డే ఫైనల్ మ్యాచ్లో అత్యంత తక్కువ స్కోరు (50) నమోదు చేసిన జట్టుగా శ్రీలంక చెత్త రికార్డును సాధించింది. గతంలో షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లోనే భారత్ 54 పరుగులకే ఆలౌట్ కాగా.. ఇప్పుడా రికార్డును శ్రీలంకనే తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం.
- వన్డేల్లో శ్రీలంకకు ఇది రెండో అత్యల్ప స్కోరు. ఇప్పుడు భారత్పై 50 పరుగులకు ఆలౌటైన లంక.. 2012లో దక్షిణాఫ్రికాపై 43 పరుగులకే కుప్పకూలింది. ఇక భారత్ (2023) మీద త్రివేండ్రం వేదికగా 73 పరుగులే చేసింది.
- వన్డే కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన సిరాజ్.. ఆసియా కప్లోనూ రెండో బెస్ట్ ప్రదర్శన కావడం విశేషం. శ్రీలంక మాజీ బౌలర్ అజంత మెండిస్ (6/13) తర్వాత సిరాజ్ 6/21 స్పెల్తో రెండో స్థానంలో నిలిచాడు.
- ఈ మ్యాచ్లో మొత్తం 10 వికెట్లను భారత పేసర్లే తీయడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
ఈ ఐపీఎల్ సీజన్లో తొలిసారి ధోనీ ఔటయ్యాడు. అయితే, అతడు చివరి ఓవర్లో సింగిల్ను తిరస్కరించడంపై నెట్టింట చర్చకు తెర లేచింది. -
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
-
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
-
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్బార్.. ధర, ఫీచర్లివే..!
-
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?