IND vs BAN: బంగ్లాతో టెస్టు సిరీస్కు వేళాయే.. భారత్ సత్తా చూపేనా..?
వన్డే సిరీస్ పోయింది. కనీసం రెండు టెస్టుల సిరీస్ను అయినా గెలిచి తిరిగి రావాలని టీమ్ఇండియాను అభిమానులు కోరుతున్నారు. బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు ప్రారంభం కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: పసికూన అనుకొంటే బెబ్బులిలా రెచ్చిపోయి బలమైన టీమ్ను ఓడించి వన్డే సిరీస్ను కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. తాజాగా మరో సిరీస్ కోసం సిద్ధమవుతున్నాయి. ఇంతకీ ఆ రెండు జట్లు ఏంటో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందిగా.. ఒకటి టీమ్ఇండియా కాగా.. మరొకటి బంగ్లాదేశ్. బుధవారం నుంచి భారత్-బంగ్లా మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
గాయాల బాధ వెంటాడుతున్న టీమ్ఇండియాను రాహుల్ ద్వయం ఎలా ముందుకు తీసుకెళ్తుందేమోనని అభిమానుల్లో ఆందోళన కొనసాగుతోంది. ఎందుకంటే రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ వేలి గాయంతో తొలి టెస్టుకు దూరం కాగా.. రెండో మ్యాచ్కూ అందుబాటులో ఉండటమూ అనుమానమే. ఈ క్రమంలో కేఎల్ రాహుల్కు సారథ్య బాధ్యతలు అప్పగించగా.. అతడికి డిప్యూటీగా ఛెతేశ్వర్ పుజారా వచ్చాడు. మరోవైపు షమీ, బుమ్రా, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు లేరు. అయినప్పటికీ బౌలింగ్లోనూ ఉమ్రాన్ మాలిక్, ఉమేశ్ యాదవ్, అశ్విన్ ఉండగా.. విరాట్ కోహ్లీ, శ్రేయస్, పుజారా, రాహుల్, పంత్తో బ్యాటింగ్లోనూ టీమ్ఇండియా బలంగానే ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా తొలి టెస్టుకు జట్టును ప్రకటించింది. షకిబ్ సారథ్య బాధ్యతలను చేపట్టాడు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యాచ్లు జరుగుతాయి.
మ్యాచ్లు ఇలా..
మొదటి టెస్టు మ్యాచ్: డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 18 వరకు
రెండో టెస్టు మ్యాచ్: డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 26 వరకు
జట్ల వివరాలు:
భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుబ్మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, నవ్దీప్ సైని, సౌరభ్ కుమార్, జయ్దేవ్ ఉనద్కత్
బంగ్లాదేశ్: మహముదుల్ హసన్, నజ్ముల్ హోస్సేన్, మోమినల్ హక్, యాసిర్ అలీ, ముష్ఫికర్ రహీమ్, షకిబ్ అల్ హసన్ (కెప్టెన్), లిటన్ దాస్, నురుల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ఖలిద్ అహ్మద్, ఎబాడట్ హోస్సేన్, షోరిఫుల్ ఇస్లామ్, జకీర్ హసన్, రేజార్ రెహ్మాన్, అనముల్ హక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి