IPL 2022 Auction: ధరల్లో హెచ్చుతగ్గులైనా.. మళ్లీ సొంతగూటికే!
ఐపీఎల్ వేలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఏ ఆటగాడిని.. ఏ ఫ్రాంఛైజీ.. ఎంత మొత్తానికి తీసుకుంటుందో అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని జట్లు...
ఐపీఎల్ వేలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఏ ఆటగాడిని.. ఏ ఫ్రాంఛైజీ.. ఎంత మొత్తానికి తీసుకుంటుందో అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని జట్లు తమ పాత ఆటగాళ్లను తిరిగి తీసుకునేందుకు ఆసక్తి చూపుతాయి. అలా ఈసారి కూడా ఇప్పటివరకు కొన్ని జట్లు తాము వదిలేసుకున్న ప్లేయర్లను కొనుగోలు చేశాయి. అందులో కమిన్స్ ధర సగానికి పడిపోగా హర్షల్ పటేల్ ధర అనూహ్యంగా పెరిగింది. ఈ జాబితాలో మరి కొందరు ఆటగాళ్లు కూడా ఉన్నారు.
* సగానికి పడిపోయిన కమిన్స్
ఆస్ట్రేలియన్ పేసర్ ప్యాట్ కమిన్స్ ఈసారి తిరిగి కోల్కతా జట్టులో చేరాడు. 2020 వేలంలో ఆ జట్టు అతడిని రూ.15.5 కోట్లకు భారీ మొత్తానికి కొనుగోలు చేయడంతో రికార్డు నెలకొల్పాడు. అప్పటివరకు విదేశీ ఆటగాళ్లలో ఇంత మొత్తం దక్కించుకున్న ఆటగాడిగా కమిన్స్ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అయితే, ఈసారి మాత్రం ఆ ధరలో సగానికి పడిపోయాడు. కమిన్స్ కోసం ఈ మెగా వేలంలో ఇతర జట్లు పెద్దగా ఆసక్తి చూపకపోగా కోల్కతానే తిరిగి రూ.7.25 కోట్లకు కొనుగోలు చేసింది.
* పంట పడించుకున్న హర్షల్ పటేల్
టీమ్ఇండియా యువ పేసర్ హర్షల్ పటేల్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ మొత్తం వెచ్చించి తిరిగి దక్కించుకుంది. గతేడాది హర్షల్ మొత్తం 32 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ విన్నర్గా నిలిచాడు. అయితే, వేలానికి ముందు వదిలేసుకున్న ఆర్సీబీ తిరిగి ఈ మెగా వేలంలో రూ.10.75 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. 2018లో హర్షల్ను కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన దిల్లీ క్యాపిటల్స్ గతేడాది ట్రేడింగ్ పద్ధతిలో బెంగళూరుకు వదిలేసింది. దీంతో ఆ జట్టు తరఫున రాణించిన హర్షల్ ఇప్పుడు రికార్డు ధరతో పంట పడించుకున్నాడు.
* నితీశ్ రాణా మంచి ధరే
(Photo: Nitish Rana Instagram)
కోల్కతా నైట్ రైడర్స్ ప్రధాన ఓపెనర్ నితీశ్ రాణా కూడా తిరిగి సొంత గూటికి చేరుకున్నాడు. కొన్నేళ్లుగా ఆ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతూ నిలకడైన ప్రదర్శన చేస్తున్న ఈ లెఫ్ట్హ్యాండ్ బ్యాట్స్మన్ను ఈసారి ఆ జట్టు వదిలేసింది. ఈ క్రమంలోనే మెగా వేలంలో రూ.1 కోటి కనీస ధరకు నమోదు చేసుకోగా ఆ జట్టు ఈసారి రూ. 8 కోట్లకు తిరిగి సొంతం చేసుకుంది. 2015లో తొలిసారి ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున అడుగుపెట్టిన అతడు 2017 వరకు ఆ జట్టులోనే కొనసాగాడు. ఇక 2018 నుంచి కోల్కతాలో రాణిస్తూ ఏటా 300 పైచిలుకు పరుగులు చేస్తున్నాడు. దీంతో అతడిపై నమ్మకం ఉంచిన కోల్కతా తిరిగి సొంతం చేసుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి మెగా వేలంలో ఇప్పటివరకు ఇద్దరు ఆటగాళ్లని తిరిగి కొనుగోలు చేసింది. అందులో వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో ఒకరు కాగా, మరొకరు రాబిన్ ఉతప్ప. బ్రావో చాలా ఏళ్లుగా ఆ జట్టులో కొనసాగుతున్నా.. ఉతప్ప గతేడాదే చెన్నై జట్టులో చేరాడు. అయితే, వీరిద్దరినీ వేలానికి ముందు వదిలేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ కొనుగోలు చేయడం విశేషం. బ్రావో గతేడాది రూ.4.40 కోట్లు దక్కించుకోగా ఈసారి కాస్త పెరిగి రూ.6.40 కోట్లకు సొంత గూటికి చేరాడు. మరోవైపు ఉతప్ప గతేడాది లాగే ఈసారి కూడా కనీస ధర రూ.2 కోట్లకే అదే జట్టు చెంతకు చేరాడు.
-ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్