IPL 2022 : ఐపీఎల్ మెగా వేలం.. తుది జాబితా విడుదల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలంపై సర్వత్రా..
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా మెగా వేలం జరగనుంది. ఇప్పటికే పాత జట్ల రిటెన్షన్, కొత్త టీమ్లు ఆటగాళ్ల ఎంపికతోపాటు వేలం కోసం రిజిష్ట్రేషన్ కూడా పూర్తి అయిపోయింది. దీంతో మెగా వేలంలో పాల్గొనే ప్లేయర్ల లిస్ట్ను బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 590 మంది క్రికెటర్లు మెగావేలంలో పాల్గొనబోతున్నారు. ఇందులో 228 మంది క్యాప్డ్ (జాతీయ జట్లకు ఎంపికైన వారు), 355 మంది అన్క్యాప్డ్ (జాతీయ టీమ్కు ఎంపిక కానివారు), ఏడుగురు అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లతోపాటు కొత్తగా లఖ్నవూ, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు వచ్చిన విషయం తెలిసిందే.
వెస్టిండీస్ స్టార్ బ్యాటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ వేలంలో లేకపోవడం గమనార్హం. డుప్లెసిస్, డేవిడ్ వార్నర్, ప్యాట్ కమిన్స్, కగిసో రబాడ, ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డికాక్, జానీ బెయిర్స్టో, జాసన్ హోల్డర్, డ్వేన్ బ్రావో, షకిబ్ అల్ సన్, వహిందు హసరంగ, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, కృనాల్ పాండ్య తదితరుల కోసం తీవ్ర పోటీ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సారి ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనబోయే వారిలో అత్యధిక వయసు కలిగిన ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ (43) కాగా..తక్కువ వయసు కలిగిన ఆటగాడు అఫ్గానిస్థాన్ అన్క్యాప్డ్ ప్లేయర్ నూర్ అహ్మద్ (17). ఈ జాబితాలో సచిన్ కుమారుడు అర్జున్ తెందూల్కర్ (బేస్ ప్రైస్ రూ. 20 లక్షలు), పశ్చిమ్ బంగా మంత్రి, క్రికెటర్ మనోజ్ తివారీ (రూ. 50 లక్షలు), వెటరన్ బౌలర్ శ్రీశాంత్ (రూ. 50 లక్షలు) మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ప్రస్తుతం జట్లు రిటెన్షన్, ఎంపిక చేసుకున్న ఆటగాళ్లు
* చెన్నై సూపర్ కింగ్స్ : ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్
* దిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్ నార్జ్
* కోల్కతా నైట్రైడర్స్: ఆండ్రూ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్, సునిల్ నరైన్
* ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్
* పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్, అర్షదీప్ సింగ్
* రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్
* సన్రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్
* అహ్మదాబాద్: హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్
* లక్నవూ: కేఎల్ రాహుల్, మార్కస్ స్టొయినిస్, రవి బిష్ణోయ్
వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు