IPL 2024: జేసన్‌ రాయ్‌ ఔట్.. కేకేఆర్‌లోకి ఫిలిప్‌ సాల్ట్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు జేసన్ రాయ్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌-2024 సీజన్‌ మొత్తానికి దూరం అవుతున్నాడు.

Published : 11 Mar 2024 00:12 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌-2024 (IPL 2024) మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. మార్చి 22న సీఎస్కే, ఆర్సీబీ మధ్య ఆరంభపోరు జరగనుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) ఆటగాడు జేసన్ రాయ్ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌ మొత్తానికి దూరం అవుతున్నాడు. దీంతో కేకేఆర్‌ అతడి స్థానంలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాటర్ ఫిల్ సాల్ట్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్‌ తన ఎక్స్‌ (X) ఖాతాలో పంచుకుంది.  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కూడా ఫిలిప్‌ సాల్ట్‌ జట్టులోకి వస్తున్నాడని ప్రకటించింది. రిజర్వ్‌ ధర రూ.1.50 కోట్లకు కేకేఆర్‌ తీసుకుంది. ఫిలిప్‌కిది ఐపీఎల్‌లో రెండో సీజన్‌. గతేడాది దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున 9 మ్యాచ్‌లు ఆడి 218 పరుగులు చేశాడు. మార్చి 23న ఈడెన్‌ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో కోల్‌కతా తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని