Ind vs Aus: టీమ్ ఇండియా 36కి ఆలౌట్.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!
India vs Australia: రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో (Australia) పింక్ బాల్ టెస్ట్లో భారత్ (Team India) ఓ ఇన్నింగ్స్లో 36 పరుగులకే అలౌట్ (36 allout) అయ్యింది. ఇప్పుడు ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy) భారత్ - ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య జరిగే కీలక సిరీస్. అందులో విజయం దక్కితే.. ఆ ఆనందమే వేరు. అంతటి ప్రతిష్ఠాత్మక సిరీస్లో భారత్ ఓ ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దాంతో ఆ మ్యాచ్లో దారుణ పరాజయం పాలైంది. భారత క్రికెట్ ప్రేమికులు ఈ విషయాన్ని ఎప్పటికీ మరచిపోరు. అందుకే ఇప్పుడు బదులు తీర్చుకునే టైమ్ వచ్చింది అని నాటి విషయాల్ని గుర్తు చేస్తున్నారు.
అది డిసెంబరు 17, 2020.. ఆస్ట్రేలియా టూర్లో తొలి టెస్ట్ మ్యాచ్. అప్పట్లో టూర్లో ఒక పింక్ బాల్ టెస్ట్ (డే అండ్ నైట్ టెస్ట్) ఉండాలి అనుకునేవారు. అలా తొలి టెస్టునే పింక్ బాల్ టెస్ట్గా పెట్టుకున్నారు. ఆ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో భారత్ 244 పరుగులు చేసింది. ఆసీస్ను 191కే పడగొట్టింది. దీంతో భారత్ విజయం సాధిస్తుందేమో అనుకున్నారంతా. కానీ రెండో ఇన్నింగ్స్లో భారత్కు భంగపాటు ఎదురైంది. కేవలం 36 పరుగులకే భారత బ్యాటర్లు దుకాణం సర్దేశారు. పాట్ కమిన్స్ 4, జోష్ హేజిల్వుడ్ 5 వికెట్లతో విరాట్ కోహ్లీ సేన నడ్డి విరిచారు. ఆ తర్వాత 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూలు రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించారు. దాంతో నాలుగు టెస్టుల సిరీస్లో 1- 0 ఆధిక్యం సంపాదించారు కూడా.
ఆ మ్యాచ్ ఓటమి ఓ బాధ అయితే.. 36 పరుగులకే ఆలౌట్ అవ్వడం ఇంకో బాధ. ‘మరీ అంత నాసిరకమైనా బ్యాటింగా మనది?’ అని ఒకటికి రెండుసార్లు అనుకోవాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత మన వాళ్ల వీరోచిత ప్రదర్శనతో ఆ సిరీస్ను 2-1తో గెలుచుకున్నాం. అయితే ఆ 36 పరుగుల పరాభవం మాత్రం అలానే ఉండిపోయింది. ఇప్పుడు ఆసీస్ మన దగ్గరకు వచ్చింది. ఈ నెల 9 నుంచి టెస్టు సిరీస్ మొదలవబోతోంది. దీంతో ‘36’ పరాభవానికి సరైన బదులు తీర్చుకోవాల్సిందే అని అభిమానులు కోరుతున్నారు. విరాట్ టీమ్కి జరిగిన పరాభవానికి ఇప్పుడు రోహిత్ టీమ్ ఎలాంటి రివేంజ్ తీర్చుకుంటుందో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్