Team India: టీ20 ప్రపంచకప్ 2007 ఫైనల్ ‘ఓవర్’ హీరో.. క్రికెట్కు వీడ్కోలు
తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్ను (T20 world cup 2007) ఎంఎస్ ధోనీ (MS Dhoni) నాయకత్వంలోని భారత్ సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. పాక్పై ఫైనల్లో (IND vs PAK) పోరాడి మరీ విజయం సాధించింది. ఈ విజయంలో జోగిందర్ శర్మ (Joginder Sharma) కీలక పాత్ర పోషించాడు.
ఇంటర్నెట్ డెస్క్: 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్.. తొలిసారి జరుగుతున్న పొట్టి వరల్డ్కప్ మరి అది. ఎలాంటి అంచనాలు లేకుండా ఫైనల్కు చేరిన టీమ్ఇండియా కప్ను సొంతం చేసుకొంది. తుది పోరులో పాకిస్థాన్ను ఐదు పరుగుల తేడాతో ఓడించడంలో కీలక పాత్ర పోషించిన మీడియం పేసర్ జోగిందర్ శర్మ (Joginder Sharma) అందరికీ గుర్తుండే ఉంటాడు. ఇప్పుడెందుకు అంటారా..? తొలి టీ20 ప్రపంచకప్ను భారత్కు అందించిన ఈ హీరో అంతర్జాతీయతోపాటు దేశవాళీ క్రికెట్కు గుడ్బై చెప్పేశాడు. 2004లో జాతీయ జట్టులోకి వచ్చిన జోగిందర్ టీమ్ఇండియా తరఫున కేవలం నాలుగు వన్డేలు, నాలుగు టీ20లను మాత్రమే ఆడాడు. పొట్టి కప్ ఫైనల్ మ్యాచే అతడి చివరి టీ20 కావడం గమనార్హం. 2008 నుంచి 2012 వరకు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మ్యాచుల్లో పాల్గొన్నాడు. ప్రపంచకప్లో రాణించినప్పటికీ.. జాతీయ జట్టు తరఫున పెద్దగా అవకాశాలు రాలేదు. 2007లోనే హరియాణా పోలీస్ శాఖలో జాయిన్ అయిన జోగిందర్.. 2020నాటికి డిప్యూటీ సూపరింటెండెంట్గా ఎదిగాడు.
ఈ క్రమంలో అన్ని విభాగాల క్రికెట్కు వీడ్కోలు చెబుతూ జోగిందర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. ‘‘కృతజ్ఞతాభావం, గర్వంతో ఇవాళ నేను అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నా. 2002 నుంచి 2007 వరకు సాగిన క్రికెట్ ప్రయాణం నా జీవితంలో మరుపురాని అనుభవాలను మిగిల్చింది. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. ఇలా అవకాశం కల్పించిన బీసీసీఐ, హరియాణా క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్, హరియాణా ప్రభుత్వానికి ధన్యవాదాలు. నాకు కోచింగ్ సేవలు, నాతో ఆడిన సహచరులు, మెంటార్స్, సహాయక సిబ్బందికి రుణపడి ఉంటా. కలను నిజం చేసుకోవడానికి పూర్తి సహాయ సహకారాలను అందించిన అభిమానులకు ధన్యవాదాలు. ఎల్లప్పుడూ స్ఫూర్తి నింపుతూ మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు. క్రికెటర్గా, పోలీస్ ఆఫీసర్గా ఎదగడంలో కీలకంగా వ్యవహరించిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు’’ అని సందేశం పెట్టాడు.
ఫైనల్లో అప్పుడు అలా..
టీ20 ప్రపంచకప్ 2007 ఫైనల్ మ్యాచ్లో.. తొలుత భారత్ బ్యాటింగ్లో 157/5 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్ 19 ఓవర్లకు 145/9 స్కోరు చేసింది. చివరి ఓవర్లో పాక్ విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. అప్పటికే స్టార్ బ్యాటర్ మిస్బా ఉల్ హక్ క్రీజ్లో ఉన్నాడు. అయితే కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ మాత్రం బంతిని జోగిందర్ చేతికి ఇచ్చాడు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తొలి బంతిని వైడ్గా వేసిన జోగిందర్.. రెండో బంతికి సిక్స్ ఇచ్చాడు. దీంతో పాక్ విజయ సమీకరణ నాలుగు బంతుల్లో ఆరు పరుగులుగా మారింది. భారత అభిమానుల్లో కంగారు మొదలైంది. మరో భారీ షాట్ కొడితే విజయం పాక్దే అవుతుందని ఆందోళన చెందారు. కానీ, జోగిందర్ వేసిన బంతిని స్కూప్ చేయబోయిన మిస్బా ఫైన్లెగ్ వైపు షాట్ కొట్టాడు. అక్కడే కాచుకొని ఉన్న శ్రీశాంత్ అద్భుతమైన క్యాచ్ను ఒడిసిపట్టడం.. పాక్ 152 పరుగులకే ఆలౌట్ కావడంతో తొలి టైటిల్ టీమ్ఇండియా ఖాతాలో పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్