Team India: ఇప్పటికీ ఆ ఓటమి బాధిస్తోంది.. దేవుడు మరోలా తలిచాడు: కేఎల్ రాహుల్, కుల్దీప్
వరల్డ్ కప్ ఫైనల్లో (ODI World Cup 2023) టీమ్ఇండియా ఓడి రన్నరప్గా నిలిచింది. దీంతో యావత్ దేశం నిరాశ చెందింది. తాజాగా టీమ్ఇండియా క్రికెటర్లు కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) ఫైనల్ ముగిసి నాలుగు రోజులైనా ఆ ఓటమి చేదు జ్ఞాపకాలు మాత్రం టీమ్ఇండియా (Team India) ఆటగాళ్లను వదలడం లేదు. తాజాగా భారత మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్తోపాటు చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆసీస్పై ఫైనల్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ 107 బంతుల్లో 66 పరుగులు చేశాడు. దీంతో మూడు ఫొటోలను షేర్ చేసిన కేఎల్ రాహుల్ (KL Rahul) ‘‘ఇప్పటికీ బాధిస్తోంది’’ అని క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో క్రికెట్ అభిమానులు కూడా రాహుల్కు మద్దతుగా కామెంట్లు చేశారు. ‘‘భారత జట్టు ఆటగాళ్లు మమ్మల్ని ఎంతో సంతోషపరిచారు. గర్వపడేలా చేసిన మీ పోరాటం అద్భుతం. తప్పకుండా బలంగా తిరిగి వస్తారు’’ అని ప్రతిస్పందించారు. కేఎల్ రాహుల్ ఈ మెగా టోర్నీలో 11 మ్యాచుల్లో 452 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు.
ముగింపు నిరుత్సాహపరిచింది: కుల్దీప్
మెగా టోర్నీలో ఫైనల్ మినహా మిగతా మ్యాచుల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఫైనల్లో ఓడినా.. తప్పకుండా పుంజుకుని వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకుంటామని కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘చెన్నై నుంచి అహ్మదాబాద్కు మా ప్రయాణం ముగిసిన తీరు చివర్లో నిరుత్సాహానికి గురి చేసింది. దాదాపు ఆరు వారాలపాటు సాగిన మెగా టోర్నీలో మా లక్ష్యాలను ఒక్కొక్కటి సాధించుకుంటూ ముందుకు సాగిన విధానం మాత్రం గర్వంగా ఉంది. అయితే, ఫైనల్లో ఓటమి బాధ ఉన్నప్పటికీ.. తదుపరి అవకాశం కోసం తీవ్రంగా కష్టపడతాం. బాధ నుంచి కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. జీవితమంటే ఇదే. కప్ను అందుకోవడం అద్భుతంగా ఉంటుంది. అయితే, దేవుడు మరోలా తలిచాడు. కోలుకుని రావడం కష్టమే కానీ భవిష్యత్తుపై నమ్మకం ఉంచి ప్రయాణం కొనసాగిస్తాం’’ అని కుల్దీప్ పోస్టు పెట్టాడు. కుల్దీప్ యాదవ్ మొత్తం 11 మ్యాచుల్లో 15 వికెట్లు పడగొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్