FIFA World Cup: మేం సపోర్ట్ చేసే జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి: కేఎల్ రాహుల్
ఫిఫా ప్రపంచకప్లో మేం మద్దతిచ్చే జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయని, కాబట్టి ఫైనల్ మ్యాచ్ని వీక్షిస్తూ మంచి భోజనం లాగించేస్తామని టీమ్ఇండియా ఆటగాడు కేఎల్ రాహుల్ అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా 188 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐదు రోజులపాటు మైదానంలో అలసిపోయిన భారత క్రికెటర్లు ఆదివారం జరిగే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ని వీక్షించడానికి సిద్ధమవుతున్నారు. ఫుట్బాల్ ప్రపంచకప్ తుదిపోరులో అర్జెంటీనా, ఫ్రాన్స్ తలపడనున్నాయి. ఫిఫా ఫైనల్ మ్యాచ్ గురించి టీమ్ఇండియా ఆటగాడు కేఎల్ రాహుల్ మాట్లాడాడు. అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లలో ఎవరికి మద్దతివ్వాలనే విషయంలో భారత జట్టులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయని పేర్కొన్నాడు. అయితే, మేం సపోర్ట్ చేసే జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్కమించాయని వివరించాడు.
‘వరుసగా ఐదు రోజులు మ్యాచ్ ఆడటంతో అలసిపోయాం. ఈ రోజు రాత్రి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ని చూసుకుంటూ రిలాక్స్ అవుదామనుకుంటున్నాం. మన జట్టులో ప్రతి ఒక్కరికి ఫుట్బాల్ అంటే ఇష్టం. వార్మప్ చేసే సమయంలో మేం చాలాసార్లు ఫుట్బాల్ ఆడాం. మీరు కూడా చూసే ఉంటారు. మేం ఏ జట్లకైతే మద్దతు ఇస్తున్నామో అవి ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయనుకుంటా. మాలో కొంతమంది బ్రెజిల్ అభిమానులు, కొంతమంది ఇంగ్లాండ్ అభిమానులు ఉన్నారు. అర్జెంటీనా లేదా ఫ్రాన్స్ మద్దతుదారులు ఎవరో నాకు తెలియదు. కాబట్టి.. మ్యాచ్ని చూసి ఎంజాయ్ చేస్తాం అంతే. మేమంతా కలిసి మ్యాచ్ని వీక్షించి మంచి భోజనం లాగించేస్తాం’ అని తొలి టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో రాహుల్ పేర్కొన్నాడు. ఇక, బంగ్లాదేశ్తో రెండో టెస్టు డిసెంబరు 22న ప్రారంభంకానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు