KKR vs LSG: లఖ్నవూ భవితవ్యం నేడు తేలేనా..? వరుణుడు అనుగ్రహించేనా..?
ఐపీఎల్ 2023 సీజన్లో (IPL 2023) లఖ్నవూ, కోల్కతా (KKR vs LSG) తమ చివరి మ్యాచ్ను ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 గంటలకు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే లఖ్నవూకు ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు అవుతుంది. వర్షం వల్ల రద్దు అయినా లఖ్నవూకు అవకాశాలు ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచిన లఖ్నవూ సూపర్ జెయింట్స్ (LSG) ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. వరుసగా హ్యాట్రిక్ విజయం సాధించి బెర్తును ఖరారు చేసుకోవాలని లఖ్నవూ ఊపు మీదుండగా.. భారీ గెలుపుతో పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంతో టోర్నీని ముగించాలని కోల్కతా నైట్రైడర్స్ భావిస్తోంది.
ప్రస్తుతం లఖ్నవూ 15 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. చివరి మ్యాచ్లో గెలిస్తే 17 పాయింట్లతో ఇతర జట్ల ఫలితాలో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్కు చేరుతుంది. ఒకవేళ ఓడినా అవకాశాలు ఉన్నాయి. కానీ, అది ముంబయి, బెంగళూరు జట్ల ఫలితాలపై ఆధార పడి ఉంది. ఇరు జట్లూ తమ చివరి మ్యాచుల్లో ఒక్క టీమ్ ఓడినా లఖ్నవూకు బెర్తు ఖాయం. కానీ, ఇది తేలాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి. అలా కాకుండా ప్లేఆఫ్స్ భవిష్యత్తుపై ఇవాళ స్పష్టత రావాలంటే గెలిచి తీరాలి. అయితే, కోల్కతా నైట్రైడర్స్ను ఏమాత్రం తక్కువగా అంచనా వేసినా ఇక్కట్లు తప్పవు. గత మ్యాచ్లో చెన్నైను వారి సొంత గడ్డపైనే కోల్కతా ఓడించింది. ఇవాళ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో కావడంతో కోల్కతాను ఆపడం అంత తేలికేం కాదు. ఈ మ్యాచ్లో కోల్కతా గెలిస్తే 14 పాయింట్లతో ఏడో స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. అదీనూ, ముంబయి మ్యాచ్ ఫలితంపై ఆధార పడి ఉంది.
హార్డ్ హిట్లర్ మధ్య పోటీ
రెగ్యులర్ సారథి కేఎల్ రాహుల్ లేకపోయినా.. కృనాల్ పాండ్య నాయకత్వంలో లఖ్నవూ అద్భుత విజయాలను సాధించింది. ఆ జట్టులో కేల్ మయేర్స్, డికాక్, మార్నస్ స్టాయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని వంటి హార్డ్ హిట్టర్లు ఉన్నారు. మ్యాచ్ను ఎలాంటి పరిస్థితుల్లోనైనా మలుపు తిప్పగలరు. వరుణ్ చక్రవర్తి, శార్దూల్, సునీల్ నరైన్, సుయాశ్ శర్మతో కూడిన కోల్కతా బౌలింగ్ దళాన్ని ఆడటంపైనే లఖ్నవూ విజయావకాశాలు ఉన్నాయి. అలాగే కోల్కతాలోనూ జేసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, ఆండ్రూ రస్సెల్, రింకు సింగ్, గుర్బాజ్ దూకుడుగా ఆడటంలో సిద్ధహస్తులు. ఇరు జట్ల బ్యాటింగ్ విభాగాల్లో ఏది రాణిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వరుణుడు కరుణించేనా..?
గత రాత్రి కోల్కతాలో వర్షం పడటంతో మ్యాచ్ జరగడంపై అభిమానుల్లో సందిగ్ధత నెలకొంది. తమ మైదానంలో చివరి లీగ్ మ్యాచ్ను చూడాలనే ఆశ నెరవేరుతుందో లేదోనని ఆందోళనతో ఉన్నారు. అయితే, మ్యాచ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని వాతావరణ శాఖ చెప్పడం ఊరటనిచ్చే అంశం. మ్యాచ్ సమయానికి వాన పడే అవకాశాలు చాలా తక్కువని పేర్కొంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే, లఖ్నవూ ఖాతాలో ఒక పాయింట్ వచ్చి చేరుతుంది. అప్పుడు 16 పాయింట్లతో మెరుగైన రన్రేట్ కారణంగా ఒక బెర్తు ఖరారు అయ్యే అవకాశాలు ఎక్కువే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్