NZ vs SL: భారీ విజయంపై కన్నేసిన న్యూజిలాండ్..
న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక.. 46.4 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది. ప్రతిగా కివీస్ బ్యాటర్లు అదరగొడుతున్నారు.
బెంగళూరు: శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్లో న్యూజిలాండ్ భారీ విజయంపై కన్నేసింది. 172 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్కు ఓపెనర్లు డేవాన్ కాన్వే (45; 42 బంతుల్లో 9 ఫోర్లు), రచిన్ రవీంద్ర (42; 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు) శుభారంభం అందించారు. వీరు తొలి వికెట్కు 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ, ఇద్దరూ వరుస ఓవర్లలో ఔటయ్యారు. చమీరా బౌలింగ్లో కాన్వే, తీక్షణ బౌలింగ్లో రచిన్.. ధనంజయకు చిక్కారు. కేన్ విలియమ్సన్ (14)ని ఏంజెలో మాథ్యూస్ పెవిలియన్కు పంపాడు. 19 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 132/3. డారిల్ మిచెల్ (29*), చాప్మన్ (1*) క్రీజులో ఉన్నారు.
చెలరేగిన న్యూజిలాండ్ బౌలర్లు.. ఆలౌటైన శ్రీలంక
ప్రపంచకప్ ఆఖరి దశకు చేరుకుంది. శ్రీలంకతో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్లో కివీస్ బౌలర్లు అదరగొట్టారు. ఈ మ్యాచ్లో ఘన విజయం సాధిస్తేనే న్యూజిలాండ్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి 46.4 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది. టాప్ ఆర్డర్లో ఓపెనర్ కుశాల్ పెరీరా (51; 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్కడే రాణించాడు. అతడు క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలతో విరుచుకుపడి 22 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మిగతా ఆటగాళ్లు పాథుమ్ నిశాంక (2), కుశాల్ మెండిస్ (6), సదీరా సమరవిక్రమ (1), చరిత్ అసలంక (8) వరుసగా పెవిలియన్ బాటపట్టారు. ఏంజెలో మాథ్యూస్ (16), ధనంజయ డిసిల్వా (19), కరుణరత్నె (6), దుష్మంత చమీరా (1) పరుగులు చేశారు. 128 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయిన లంక.. మహీశ్ తీక్షణ (39*), దిల్షాన్ మదుశంక (19) పోరాడటంతో కాస్త గౌరవప్రదమైన స్కోరు సాధించింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, ఫెర్గూసన్ 2, మిచెల్ శాంట్నర్ 2, రచిన్ రవీంద్ర 2, టిమ్ సౌథీ ఒక వికెట్ పడగొట్టారు.
టిమ్ సౌథీ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో నిశాంక ఔటయ్యాడు. అతడు వికెట్ కీపర్ లేథమ్కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత కుశాల్ మెండిస్, సదీర విక్రమార్కలను ట్రెంట్ బౌల్ట్ ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. బౌల్ట్ బౌలింగ్లోనే అసలంక ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మెరుపు అర్ధ శతకం బాదిన కుశాల్ పెరీరాను ఫెర్గూసన్ పెవిలియన్కు పంపాడు. శాంట్నర్ తన వరుస ఓవర్లలో మాథ్యూస్, ధనంజయను ఔట్ చేశాడు. వీరిద్దరూ డారిల్ మిచెల్కు క్యాచ్ ఇచ్చారు. ఫెర్గూసన్ బౌలింగ్లో కరుణరత్నె.. లేథమ్కు చిక్కాడు. చమీరాను రచిన్ రవీంద్ర ఔట్ చేశాడు. పదో వికెట్కు తీక్షణ, మదుశంక 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్