Corona: వాటిని తల్చుకుంటే భయమేస్తుంది
ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మేఖేల్ వాన్ ఆందోళన వ్యక్తం చేశాడు. టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్, వికెట్ కీపర్ రిషభ్పంత్ తాజాగా కరోనా వైరస్బారిన పడటంతో గురువారం అతడు ఓ ట్వీట్ చేశాడు...
పంత్కు పాజిటివ్గా తేలడంపై మైఖేల్ వాన్..
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్, వికెట్ కీపర్ రిషభ్పంత్ తాజాగా కరోనా వైరస్బారిన పడటంపై ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మేఖేల్ వాన్ ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశాడు. ఐసోలేషన్ నిబంధనలు మారనంతవరకు ఆటగాళ్లు వైరస్ బారినపడుతుంటారని అభిప్రాయపడ్డాడు.
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయని, అందుకు పంత్ కేసే ఉదాహరణ అని పేర్కొన్నాడు. దాంతో త్వరలో జరగబోయే ‘ది హండ్రెడ్’, ‘భారత్xఇంగ్లాండ్’ జట్ల ఐదు టెస్టుల సిరీస్లపై ఆందోళన వ్యక్తం చేశాడు. మరోవైపు ఈ ఏడాది చివర్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్పైనా వైరస్ ప్రభావం చూపుంతుందని చెప్పాడు. బయోబుడగ, క్వారంటైన్ నిబంధనలు మారకపోతే క్రికెటర్లు ఆయా సిరీస్ల నుంచి తప్పుకునే ప్రమాదముందన్నాడు.
ఇదిలా ఉండగా, ఇటీవల యూకేలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్లు పూర్తయ్యాక పలువురు ఇంగ్లిష్ జట్టు ఆటగాళ్లు కూడా వైరస్బారిన పడ్డాడు. ఇక పాకిస్థాన్తో వన్డే సిరీస్కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు బెన్స్టోక్స్ నేతృత్వంలో ద్వితీయశ్రేణి జట్టును ఎంపిక చేసి మ్యాచ్లు ఆడించింది. మరోవైపు తాజాగా పంత్కు పాజిటివ్గా తేలడంతో టీమ్ఇండియాలో కలవరం మొదలైంది. అయితే, అతడు ఇతర జట్టు ఆటగాళ్లను కలవకపోవడం ఊరట కలిగించే పరిణామం. ఈ క్రమంలోనే టీమ్ఇండియా వచ్చేనెల 4 నుంచి ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం