CSK vs GT: పరిస్థితి ఎలా ఉన్నా.. అతడి వద్ద ఓ ప్లాన్ పక్కా!
గుజరాత్ టైటాన్స్ను ఓడించి ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ను (IPL 2023) చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఐదో టైటిల్ను సొంతం చేసుకున్న జట్టుగా సీఎస్కే అవతరించింది. దీంతో సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్ (IPL 2023) టైటిల్ను గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతోపాటు ఎంఎస్ ధోనీ (MS Dhoni) నాయకత్వంపై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ను (CSK vs GT) మట్టికరింపిచి మరీ ఐదో కప్ను సీఎస్కే సొంతం చేసుకుంది. దీంతో సోషల్ మీడియాలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సహా మాజీ ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులు పోస్టులు పెట్టారు. విరాట్ కోహ్లీ తన ఇన్స్టా గ్రామ్లో స్టోరీస్ పోస్టు పెట్టాడు.
‘‘సీఎస్కే జట్టుకు శుభాకాంక్షలు. ప్రతి పరిస్థితికి పక్కా ప్రణాళిక ఉండే ధోనీ నాయకత్వంలో ఐదోసారి కప్ను నెగ్గడం బాగుంది. చరిత్రాత్మక విజయంలో రవీంద్ర జడేజా తన అసాధారణ పోరాటంతో కీలక పాత్ర పోషించాడు’’ - ఎంకే స్టాలిన్ - తమిళనాడు ముఖ్యమంత్రి
‘‘అద్భుతమైన ఫైనల్ మ్యాచ్. సీఎస్కేకు కంగ్రాట్స్. చివరి వరకు పోరాడిన గుజరాత్ టైటాన్స్ వచ్చే సీజన్లో మరింత బలంగా రావాలి’’ - సుందర్ పిచాయ్, గూగుల్ సీఈవో
‘‘ఐపీఎల్ సీజన్కు అద్భుతమైన ముగింపు. రెండు జట్లూ (చెన్నై, గుజరాత్) విజయం కోసం అద్భుతంగా పోరాడాయి. చెన్నై లోతైన బ్యాటింగ్ ఆ జట్టును విజేతగా నిలిపింది. తొలి నుంచీ ఇరు జట్లూ సూపర్గా ఆడాయి. ఎంఎస్ ధోనీకి, సీఎస్కే జట్టుకు అభినందనలు’’ - సచిన్ తెందూల్కర్
‘‘సూపర్ విక్టరీ. జడేజా (జడ్డూ) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రాయుడు, రహానె, దూబె నుంచి మంచి భాగస్వామ్యం. మోహిత్ నాణ్యమైన బౌలింగ్ వేసినప్పటికీ.. అసాధారణ పరిస్థితుల్లోనూ ఎలా నెగ్గాలనేది సీఎస్కేకు తెలుసు. మరోసారి విజిల్ పోడు’’ - వీరేంద్ర సెహ్వాగ్
‘‘ఎంఎస్ ధోనీ అదృష్టజాతకుడు. వెల్డన్ సీఎస్కే. జడేజా బ్యాటింగ్ సూపర్బ్. రాయుడుకు అద్భుతమైన ముగింపు లభించింది’’ - ఇర్ఫాన్ పఠాన్
‘‘ఎలాంటి చరిత్ర లేకుండా బతికేయాలని భావించేవారికి ఎంఎస్ ధోనీ జీవితం ఓ గుణపాఠం. ఐదోసారి ఐపీఎల్ ఛాంపియన్గా మారిన సీఎస్కే జట్టుకు అభినందనలు. అనుభవ లేమి బౌలింగ్తో ఎలా నెట్టుకొస్తారని ఫిర్యాదులు చేసిన వారికి సరైన సమాధానం ఇచ్చాడు. కంగ్రాట్స్ ఎంఎస్ ధోనీ’’ - హర్భజన్ సింగ్
‘‘కంగ్రాట్స్ సీఎస్కే.. ఒక టైటిల్ గెలవడమే కష్టం. అలాంటిది ఐదుసార్లు విజేతగా నిలవడం నమ్మశక్యంకానిది’’ - గౌతమ్ గంభీర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త