Cricket News: ఆ బాధ లేదన్న రిజ్వాన్.. దూబెపై అశ్విన్ కామెంట్.. 41 బంతుల్లోనే ఆర్సీబీ స్టార్ సెంచరీ!
ఇంటర్నెట్ డెస్క్: తమ ఓపెనింగ్ జోడీని విడదీయడంపై వచ్చిన విమర్శలను కొట్టిపడేసిన రిజ్వాన్.. అఫ్గాన్తో టీ20ల్లో అదరగొట్టిన శివమ్ దూబెపై అశ్విన్ కామెంట్లు.. కేవలం 41 బంతుల్లోనే ఆర్సీబీ స్టార్ బ్యాటర్ సెంచరీ.. పీసీబీ ఛైర్మన్ పదవికి జకా అష్రాఫ్ రాజీనామా.. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..
మీకు అలా అనిపిస్తుందేమో.. మాకు కాదు: రిజ్వాన్
‘‘పాకిస్థాన్ జట్టును బాధపెడుతుందని మీరు చెబుతారు. నేను మాత్రం అలా చెప్పలేను. బాబర్ అజామ్ గొప్ప మనసు కలిగినవాడు. మేమిద్దరం అంగీకరించిన తర్వాతనే మా జోడీని విడదీశారు. ఇందులో ఏ సమస్య లేదు. ఎలాంటి కూర్పుకైనా మేం సిద్ధమని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాం. బాగా ఆడుతున్నప్పుడు ఇలాంటివి చేయడం వల్ల కొందరికి బాధగా అనిపించవచ్చు. జట్టుకు మాత్రం విభిన్న కాంబినేషన్లను ప్రయత్నించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించాలన్న లక్ష్యం కనిపిస్తోంది. అవసరమైతే మేమిద్దరం భవిష్యత్తులో మళ్లీ ఓపెనింగ్ చేస్తాం’’ అని రిజ్వాన్ వెల్లడించాడు.
శివమ్ దూబెకు అవకాశం వస్తే మంచిదే: అశ్విన్
‘‘చాలామంది హార్దిక్ పాండ్య, శివమ్ దూబె జట్టులో ఉండాలని చెబుతున్నారు. దూబె ఆటతీరు కూడా అద్భుతంగా ఉంది. అతడి కెరీర్ ఎలా ఉందంటే ‘బిఫోర్ సీఎస్కే’.. ‘ఆఫ్టర్ సీఎస్కే’ అన్నట్లుగా ఉంది. పాక్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వెస్టిండీస్లోనూ పిచ్లు అలాగే ఉంటాయి. అందుకే సీఎస్కే తరఫున హిట్టింగ్ చేసే దూబె విండీస్లోనూ రాణించగలడు. అతడిని చూస్తే యువరాజ్ను చూసినట్లు అనిపిస్తోంది. ‘యువీ లైట్’ అని దూబెను సగర్వంగా పిలుస్తా. స్పిన్ అద్భుతంగా ఆడతాడు’’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.
విల్ జాక్స్ సూపర్ సెంచరీ
ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విల్జాక్స్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా20 లీగ్లో ఆడుతున్నాడు. ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు తరఫున బరిలోకి దిగిన విల్ డర్బన్ సూపర్ జెయింట్స్పై 41 బంతుల్లో సెంచరీ బాదాడు. ఇందులో 9 సిక్స్లు, 8 ఫోర్లు ఉన్నాయి. దీంతో ప్రిటోరియా 20 ఓవర్లలో 204/9 స్కోరు చేసింది. అనంతరం డర్బన్ 187 పరుగులకే ఓటమి పాలైంది. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్లో విల్ జాక్స్ విశ్వరూపం చూస్తామని ఆర్సీబీ అభిమానులు నెట్టింట కామెంట్లు చేశారు. గతేడాది గాయం కారణంగా దూరమైన విల్ జాక్స్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని తమకు తిరుగులేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పీసీబీ ఛైర్మన్ పదవికి జకా అష్రాఫ్ రాజీనామా
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ పదవికి జకా అష్రాఫ్ రాజీనామా చేశారు. 2023 జులై 6న ఈ పదవిలోకి వచ్చిన జకా అర్ధంతరంగానే వైదొలగడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. తన రాజీనామాను పాక్ ప్రధాని అన్వార్ ఉల్ హక్ కకార్కు జకా పంపించారు. ఓవైపు పీసీబీ మీటింగ్ జరుగుతుండగానే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వరల్డ్ కప్ అనంతరం బాబర్ అజామ్, ఇంజమామ్ ఉల్ హక్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. బాబర్తో పాటు ఓ పీసీబీ అధికారి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలను మీడియలో లీక్ చేయడం వంటి చర్యలతో జకా అష్రాఫ్ విమర్శలు ఎదుర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆట తీరుపై నెట్టింట విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా స్ట్రైక్రేట్ ఉండటం లేదని కొందరు మాజీలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వాటిపై ఏబీ డివిలియర్స్ స్పందించాడు. -
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
ఈ ఐపీఎల్ సీజన్లో తొలిసారి ధోనీ ఔటయ్యాడు. అయితే, అతడు చివరి ఓవర్లో సింగిల్ను తిరస్కరించడంపై నెట్టింట చర్చకు తెర లేచింది. -
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ