T20 world cup: పొట్టి ప్రపంచకప్ టోర్నీకి భారీ డిమాండ్.. 6 లక్షలకుపైగా అమ్ముడైన టికెట్లు
ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ ఆదివారం నుంచే ప్రారంభం కానుంది. దాదాపు రెండేళ్ల కరోనా పరిస్థితుల అనంతరం జరుగుతున్న మెగా టోర్నీ కావడంతో..ఈ సారి టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది.
(ఫొటో : ఐసీసీ ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్ : మరో మెగా సమరానికి క్రికెట్ ప్రపంచం సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ ఆదివారం నుంచే ప్రారంభం కానుంది. దాదాపు రెండేళ్ల కరోనా పరిస్థితుల అనంతరం జరుగుతున్న మెగా టోర్నీ కావడంతో.. ఈ సారి టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. పెద్దసంఖ్యలో ప్రేక్షకులు స్టేడియంలో మ్యాచ్లను వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే 6 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయని నిర్వాహకులు శుక్రవారం తెలిపారు.
ఈ పొట్టి ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా సహా కొన్ని జట్లు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నాయి. మిగతా దేశాలూ చేరుకుంటున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్లతో అక్కడ క్రికెట్ సందడి మొదలైంది. ఈ నెల 16 నుంచి తొలి రౌండ్ మ్యాచ్లు జరుగుతాయి. సూపర్-12లో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలను దక్కించుకోవడం కోసం తొలి రౌండ్లో ఎనిమిది జట్లు పోటీపడతాయి. ఈ నెల 22 నుంచి సూపర్-12 సమరం మొదలవుతుంది.
ఈ మెగా టోర్నీకి 7 ఆస్ట్రేలియా నగరాలు వేదికలుగా ఉన్నాయి. సూపర్-12లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య సిడ్నీ మైదానంలో జరిగే ఈ మ్యాచ్.. గతేడాది ఫైనల్ పోరును తలపించేలా ఉండే అవకాశం ఉంది. ఈ ఆదివారం ప్రారంభ మ్యాచ్లతోపాటు సూపర్-12 మ్యాచ్ల్లో భారీ సంఖ్యలో ప్రేక్షకులను చూసేందుకు తాము ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని ఐసీసీ టీ20 ప్రపంచకప్ చీఫ్ మిచెల్ ఎన్రైట్ అన్నారు.
చిరకాల ప్రత్యర్థుల పోరుపైనే అందరి దృష్టి..
ఇక అందరి చూపు.. అక్టోబర్ 23న జరిగే దాయాదుల పోరుపైనే. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ తలపడే ఈ పోరుకు 90 వేలకుపైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. అడిషనల్ స్టాండింగ్ రూమ్ టికెట్లు కూడా 10 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. దీంతో ఈ మ్యాచ్ జరిగే మెల్బోర్న్ క్రికెట్ మైదానం.. అభిమానులకు అసలైన క్రికెట్ మజాను అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్