MS Dhoni: ఎంఎస్ ధోనీకిదే చివరి సీజనా..? స్టీఫెన్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు
ప్రతి మ్యాచ్ సందర్భంగా ఎంఎస్ ధోనీ (MS Dhoni) వీడ్కోలుపైనే చర్చ. ఆ జట్టు మేనేజ్మెంట్ కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తున్నా సరే.. సామాజిక మాధ్యమాల్లో మాత్రం కామెంట్లు రావడం ఆగలేదు. తాజాగా సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా మరోసారి స్పష్టతనిచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) నాయకత్వంలో సీఎస్కే ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికీ తలెత్తే అనుమానం.. వచ్చే సీజన్లో ధోనీ ఆడతాడా..? లేకపోతే ఇదే చివరి సీజనా..?. ఎందుకంటే ప్రస్తుత సీజన్లోనే మోకాలి నొప్పితో బాధపడుతూనే జట్టును నడిపిస్తున్నాడు. ఈసారి ఎలాగైనా టైటిల్ను నెగ్గి ముంబయితో సమంగా ఐదుసార్లు ఛాంపియన్గా సీఎస్కేను నిలబెట్టాలని చూస్తున్నాడు. అయితే, వివిధ సందర్భాల్లో తన వీడ్కోలుపై చేసిన వ్యాఖ్యలు కూడా అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. పంజాబ్ చేతిలో చివరి బంతికి ఓటమిపాలైన అనంతరం ఫ్లెమింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. ధోనీ ఎప్పుడూ రిటైర్మెంట్పై ప్రత్యేకంగా చెప్పలేదని ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు.
‘‘ఐపీఎల్ 2023 సీజనే తనకు చివరిదని ధోనీ ఎప్పుడూ చెప్పలేదు. అతడికి ఆ ఆలోచన కూడా ప్రస్తుతానికి లేదు. ఈ సీజన్లో ఛాంపియన్గా నిలవడంపైనే దృష్టిసారించాం’’ అని ఫ్లెమింగ్ తెలిపాడు. కోల్కతాతో మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. తన ఐపీఎల్ కెరీర్ చివరి దశలో ఉందని, ఇక్కడకు వచ్చినవారంతా వీడ్కోలు పలికేందుకు వచ్చినట్లు ఉందని వ్యాఖ్యానించాడు. గత సీజన్లోనూ ఇలానే ధోనీ ఆడటంపై సందేహాలు వచ్చినా.. వాటన్నింటినీ కొట్టిపడేస్తూ ఈ సీజన్లోనూ సీఎస్కేను నడిపిస్తున్నాడు. దాదాపు మూడేళ్ల తర్వాత సొంత మైదానాల్లో మ్యాచ్లు జరగుతుండటంతో అభిమానులు భారీగా హాజరవుతున్నారు. ఈ క్రమంలో తన హోం గ్రౌండ్లోనే ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతానని గతంలో ధోనీ ప్రకటించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు