Romario Shepherd: క్లియర్ మైండ్సెట్తో ఆడా.. బాగా తినడమే నా రహస్యం: రొమారియో షెఫర్డ్
రొమారియో షెఫర్డ్ భారీ హిట్టింగ్తో ముంబయి తొలి విజయాన్ని నమోదు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో ముంబయి విజయాల ఖాతా తెరిచింది. వరుసగా మూడు ఓటముల తర్వాత ఆ జట్టుకిదే తొలి గెలుపు. దిల్లీపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకొన్న రొమారియో షెఫర్డ్ (Romario Shepherd) కేవలం 10 బంతుల్లోనే 39 పరుగులు సాధించాడు. నోకియా వేసిన చివరి ఓవర్లో ఏకంగా 32 పరుగులు రాబట్టాడు. తన ఇన్నింగ్స్పై స్పందించాడు.
‘‘ఇన్నాళ్లు చేసిన కష్టానికి ప్రతి ఫలం. నెట్స్లో తీవ్రంగా శ్రమించా. డెత్ ఓవర్లలో బ్యాటింగ్కు వెళ్లినప్పుడు దేని గురించీ ఆలోచించకూడదు. స్పష్టమైన మైండ్సెట్తో బరిలోకి దిగాలి. టిమ్ డేవిడ్తో కలిసి చివరి ఓవర్లో ఆడా. భారీగా హిట్టింగ్ చేయాలని అతడే చెప్పాడు. మైదానంలో ఒక్క వైపే పరుగులు రాబట్టాలని అనుకోలేదు. ఇలా బంతిని బాదాలంటే చాలా బలం కావాలి. బాగా తినడమే దానికి కారణం (నవ్వుతూ). అందులో ఇండియన్ ఫుడ్ కూడా ఉంది’’ అని రొమారియో వ్యాఖ్యానించాడు.
అది మామూలు హిట్టింగ్ కాదు: హార్దిక్ పాండ్య
‘‘నాలుగో మ్యాచ్లో మేం విజయం సాధించగలిగాం. చాలా తీవ్రంగా సాధన చేశాం. వ్యూహాత్మక మార్పులు చేసుకుంటూ మ్యాచ్పై పట్టు సాధించాం. జట్టులోని ప్రతి ఆటగాడూ సెట్ కావడం ముఖ్యం. డ్రెస్సింగ్ రూమ్లో ప్రతి ఒక్కరికీ మద్దతు ఉంటుంది. చివరి ఆరు ఓవర్లలో 70+ పరుగులు చేశాం. ఆఖరి ఓవర్లో షెఫర్డ్ భారీ హిట్టింగ్ చేశాడు. అది మామూలు ఆట కాదు. దిల్లీతో మ్యాచ్లో అతడి ప్రదర్శనే కీలకం. అతడే మమ్మల్ని గెలిపించాడు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటాడు. (తాను బౌలింగ్ చేయకపోవడంపై) నేను బాగానే ఉన్నా. సరైన సమయంలో బౌలింగ్ చేస్తా. ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లో రాణించాం’’ అని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) అన్నాడు.
మరికొన్ని విశేషాలు..
- ఐపీఎల్లో ముంబయి 200+ స్కోరు చేసిన 14 మ్యాచుల్లోనూ గెలవడం విశేషం. వాంఖడేలో 50 మ్యాచ్లు గెలిచిన జట్టుగా ముంబయి నిలిచింది.
- టీ20ల్లో 150 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా ముంబయి అవతరించింది. ముంబయి తర్వాత చెన్నై (148), భారత్ (144), లాంక్షైర్ (143), నాటింగ్హామ్షైర్ (143) ఉన్నాయి.
- ఐపీఎల్లో దిల్లీ తరఫున మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో బౌలర్ ఆన్రిచ్ నోకియా (65). ఉమేశ్ యాదవ్ కూడా బెంగళూరుపై 2013లో 65 పరుగులే ఇచ్చాడు.
- ఒక్క హాఫ్ సెంచరీ లేకుండా టీ20ల్లో అత్యధిక స్కోరు నమోదైన ఇన్నింగ్స్ ఇదే. దిల్లీపై ముంబయి 234/5 స్కోరు చేసింది. ఒక్క బ్యాటర్ కూడా అర్ధశతకం చేయలేదు. రోహిత్ శర్మ (49) టాప్ స్కోరర్.
- కనీసం 10 బంతులు ఎదుర్కొన్న బ్యాటర్లలో అత్యధిక స్ట్రైక్రేట్(390) సాధించిన ఆటగాడు షెఫర్డ్.
- దిల్లీ తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన నాలుగో బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (19 బంతులు). క్రిస్ మోరిస్ (2016లో 17 బంతులు) ముందున్నాడు.
- ముంబయి పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్లో 150 వికెట్ల మార్క్ను తాకాడు. లసిత్ మలింగ (170) ముంబయి తరఫున ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!