NZ vs IND: నేడే తొలి టీ20.. గత మ్యాచ్ల రికార్డులు ఇలా..
టీ20 ప్రపంచకప్ రెండో సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం తర్వాత టీమ్ఇండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ కివీస్తో మూడేసి టీ20లు, వన్డేలు ఆడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ రెండో సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం తర్వాత టీమ్ఇండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ కివీస్తో మూడేసి టీ20లు, వన్డేలు ఆడనుంది. టీ20 సిరీస్ నవంబర్ 18 నుంచి 22 వరకు, వన్డే సిరీస్ 25 నుంచి 30 వరకు జరగనుంది. తొలి టీ20 వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభంకానుంది. ఈ సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీలకు విశ్రాంతినిచ్చి పలువురు యువ క్రికెటర్లను జట్టులోకి తీసుకున్నారు. మరి శుక్రవారం జరిగే తొలి టీ20 కోసం టీమ్ఇండియా తుది జట్టులో ఎవరెవరు ఉంటారనే దానిపై పలువురు క్రికెట్ విశ్లేషకులు తమ తమ అంచనాలను వెలువరుస్తున్నారు.
ఓపెనర్లుగా ఇషాన్, శుభమన్ గిల్!
టీమ్ఇండియా యువ సంచలనం ఇషాన్ కిషన్ను ఓపెనర్గా బరిలోకి దించే అవకాశముంది. ఇషాన్ గత కొంతకాలంగా మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ యువ బ్యాటర్ భారత్ తరఫున ఇప్పటివరకు 19 టీ20లు ఆడి 131.15 స్ట్రైక్రేట్తో 543 పరుగులు చేశాడు. శుభమన్ గిల్ ఈ సిరీస్తో టీ20ల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. ఇషాన్కు తోడుగా గిల్ ఓపెనర్గా పంపే అవకాశముంది. మూడో స్థానంలో శ్రేయస్ అయ్యర్, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగొచ్చు. వికెట్ కీపర్గా వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఆరో స్థానంలో సంజూ శాంసన్, ఏడో స్థానంలో ఆల్రౌండర్, కెప్టెన్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ చేయొచ్చు. బౌలింగ్ విషయానికొస్తే.. సీనియర్ లెగ్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్కు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. పేస్ విభాగంలో భువనేశ్వర్ కుమార్కు తోడుగా యువ పేసర్లు అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్లను తీసుకునే అవకాశముంది.
భారత్ తుది జట్టు (అంచనా)
ఇషాన్ కిషన్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, యుజేంద్ర చాహల్,భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
కివీస్-భారత్ పోరులో గత రికార్డులు ఇలా..
🏏 మ్యాచ్లు: 20
🏏 భారత్ విజయం సాధించినవి: 11
🏏 న్యూజిలాండ్ గెలిచినవి: 9
🏏 భారత్పై న్యూజిలాండ్ అత్యధిక స్కోరు: 219/6 (2019లో)
🏏 టీమ్ఇండియా అత్యధిక స్కోరు: 208/6 (2019లో)
🏏 టీమ్ఇండియా అత్యల్ప స్కోరు: 79 (2016లో)
🏏 కివీస్ అత్యల్ప స్కోరు: 111 (2021లో)
🏏 అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడు: రోహిత్ శర్మ (511)
🏏 అత్యధిక పరుగులు చేసిన కివీస్ ఆటగాడు: మున్రో (426)
🏏 ఎక్కువ వికెట్లు తీసిన న్యూజిలాండ్ బౌలర్: ఇష్ సోథి (20)
🏏 ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్: జస్ప్రీత్ బుమ్రా (12)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి