Rohit Sharma: కొత్త కిట్ కొనేందుకు రోహిత్ పాల ప్యాకెట్ల డెలివరీ చేశాడు: ఓజా
కెరీర్ ఆరంభంలో ప్రతి ఒక్కరూ శ్రమించాల్సిందే. అయితే, ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు ఇంకాస్త కష్టపడాల్సి ఉంటుంది. దానికి చక్కని ఉదాహరణ టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ (Rohit Sharma). గత అనుభవాలను భారత మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రోహిత్ శర్మ (Rohit Sharma) టీమ్ఇండియా కెప్టెన్గా ఎదిగిన తన ప్రస్థానంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెటర్గా మారేందుకు తీవ్రంగా శ్రమించాడని భారత మాజీ ఆటగాడు, ఐపీఎల్ (IPL) గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ప్రజ్ఞాన్ ఓజా తెలిపాడు. అండర్ - 15 క్రికెట్ స్థాయి నుంచి రోహిత్, ఓజా కలిసి ఆడారు. ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున కొన్ని మ్యాచ్లు ఆడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓజా ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడుతూ... క్రికెట్ ఆడే తొలి రోజుల్లో తాము ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నాడు. కొత్త కిట్ను కొనుగోలు చేసుకునేందుకు రోహిత్ శర్మ పాల ప్యాకెట్లను కూడా డెలివరీ చేసినట్లు చెప్పాడు.
‘‘నేను తొలిసారి అండర్ - 15 జాతీయ క్యాంప్లో రోహిత్ను కలిశా. అతడొక ప్రత్యేకమైన ప్లేయర్గా అందరూ చెప్పేవారు. రోహిత్కు ప్రత్యర్థిగా ఆడి ఔట్ చేశా. అయితే, ఆటలో దూకుడుగా ఉండే రోహిత్ పెద్దగా మాట్లాడేవాడు కాదు. నాతో ఆడేటప్పుడు మాత్రం చాలా దూకుడుగా ఉండేవాడు. ఎందుకు అలా ఉన్నాడో కూడా తెలియదు. కొన్నాళ్లకు మా మధ్య స్నేహం పెరిగింది. రోహిత్ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడు. ఒకసారి క్రికెట్ కిట్ బడ్జెట్ గురించి చర్చ జరుగుతుండగా రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు. దాని కోసం అతడు పాల ప్యాకెట్ల డెలివరీ కూడా చేశాడు. ఇదంతా జరిగి చాలాకాలమైంది. మా క్రికెట్ ప్రయాణం ఎలా ప్రారంభమైంది.. ఇప్పుడు రోహిత్ ఎదిగిన తీరును చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది’’ అని ఓజా తెలిపాడు.ఓజా, రోహిత్ కలిసి భారత్ తరఫున 24 మ్యాచ్లు ఆడారు. ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్ జట్టుకు ఆడిన వీరిద్దరూ తర్వాత ముంబయి ఇండియన్స్ వెళ్లిపోయారు. ఓజాకు 2015 సీజన్ చివరిది కాగా.. రోహిత్ ప్రస్తుతం ముంబయి ఇండియన్స్కు సారథిగా వ్యవహరిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్