IPL 2023: వారికి అవకాశాలు ఇవ్వాలి.. అప్పటికైనా సిద్ధం చేయాలి: మాజీ క్రికెటర్లు
ఐపీఎల్లో (IPL 2023) సత్తా చాటుతూ భారత జట్టులోకి వచ్చేందుకు యువ క్రికెటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సీజన్లో ఇద్దరు ఆటగాళ్ల ప్రదర్శన చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడు ఐపీఎల్లో ఇద్దరు ఆటగాళ్లు హాట్ టాపిక్గా మారారు. ఐపీఎల్లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని బాదిన రాజస్థాన్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఒకే ఓవర్లో ఐదు సిక్స్లు కొట్టి కోల్కతాను గెలిపించిన రింకు సింగ్ అద్భుత ఫామ్తో కొనసాగుతున్నారు. రుతురాజ్, శుభ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్.. కూడా ఉత్తమ ప్రదర్శన ఇస్తున్నారు. కానీ, వీరంతా టీమ్ఇండియాకు సెలెక్ట్ అయినవాళ్లే. యశస్వి, రింకు సింగ్ మాత్రం తమ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈసారి దూకుడుగా ఆడటంతో సెలెక్టర్లు దృష్టి సారించాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. కోల్కతాపై యశస్వి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (13 బంతుల్లోనే) సాధించిన నేపథ్యంలో.. టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో యశస్వి జైస్వాల్ (575 పరుగులు) ఆరెంజ్ క్యాప్ సాధించడానికి డుప్లెసిస్తో (576 పరుగులు) పోటీ పడుతుండగా.. రింకు సింగ్ (353 పరుగులు) కూడా మిడిలార్డర్లో కీలక ఇన్నింగ్స్లు ఆడాడు.
వారిద్దరిపై కన్నేయాలి: రవిశాస్త్రి
‘‘స్వదేశం వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్పై టీమ్ఇండియా దృష్టిసారిస్తే.. యశస్వి, రింకు సింగ్ వంటి యువ క్రికెటర్లపైనా ఓ కన్నేయాలి. ఇలాంటి ఆటగాళ్లు దూకుడుగా ఆడతారు. ఇలాంటి వారిని వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం సన్నద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలి. అప్పటికి జాతీయ జట్టులో ఉంటే అనుభవం వస్తుంది. ఒకవేళ వారిద్దరిని తీసుకోకపోతే.. సెలెక్టర్లు ఇంకేదైనా ప్రత్యామ్నాయం కోసం వెతుకులాటలో ఉన్నారేమో నాకు తెలియదు’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
తలుపు తట్టడం కాదు.. బద్దలు కొట్టాడు: హర్భజన్
‘‘యశస్వి జైస్వాల్ తనప్రదర్శనతో భారత క్రికెట్ జట్టులోకి వచ్చేందుకు తలుపు కొట్టడం కాదు.. ఏకంగా బద్దలు కొట్టినట్లు ఉంది. అతడి నిలకడైన బ్యాటింగ్తో సెలెక్టర్ల దృష్టిని తన వైపు తిప్పేసుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో కనబరిచిన ఫామ్తో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు జాతీయ జట్టులో అవకాశం కోసం మార్గం వేసుకున్నాడు. అద్భుతమైన టాలెంట్ కలిగిన యశస్విని భారత క్రికెట్కు భవిష్యత్తు తార అనడంలో సందేహం లేదు’’ అని హర్భజన్ తెలిపాడు.
వెంటనే సెలెక్ట్ చేసేస్తా: సురేశ్ రైనా
‘‘నేనే భారత జట్టు సెలెక్టర్ను అయితే వెంటనే యశస్విని జాతీయ జట్టులోకి తీసుకుంటా. వన్డే ప్రపంచ కప్లో ఆడిస్తా. వీరేంద్ర సెహ్వాగ్ను మళ్లీ గుర్తుకు తెచ్చాడు. రోహిత్ శర్మ కూడా ఇలాంటి యువ బ్యాటర్ల కోసం చూస్తుంటాడని నేను భావిస్తున్నా’’ అని సురేశ్ రైనా అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు