Novak Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 ఆడేందుకు జకోవిచ్కు లైన్ క్లియర్..!
వ్యాక్సిన్ వేయించుకోలేదనే నిబంధనల కారణంతో గత ఆస్ట్రేలియా ఓపెన్ను ఆడలేకపోయిన టెన్నిస్ స్టార్ ఆటగాడు నొవాక్ జకోవిచ్.. వచ్చే ఏడాది ఆడేందుకు మాత్రం వీసా సమస్య పరిష్కారం కావడంతో అతడి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వ్యాక్సినేషన్ తీసుకోకపోవడం వల్ల గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్కు దూరమైన టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ వచ్చేఏడాది రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది వీసా సమస్య వల్ల ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడలేకపోయిన జకోవిచ్కు ఈసారి మాత్రం ఆ సమస్య తప్పిపోయింది. వ్యాక్సినేషన్ ధ్రువపత్రం లేకపోయినా వీసా మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
‘‘సాధారణ వీసా ప్రాసెస్ జరుగుతుంది. ఎవరైనా వెళ్లొచ్చు. సరైన సమయంలో ప్రతి ఒక్కరూ రాకపోకలు సాగించొచ్చు. అలాగే ప్రత్యేకంగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ విమాన టికెట్లను బుక్ చేసుకొని రావొచ్చు. అలానే నొవాక్కూ అవకాశం ఉంది. అయితే తుది నిర్ణయం మాత్రం ఆస్ట్రేలియా ప్రభుత్వంపైనే ఆధారపడి ఉంటుంది. నొవాక్ ఇక్కడికి వచ్చి పోటీల్లో పాల్గొనాలని బలంగా కోరుకుంటున్నాడు. అతడికి ఆస్ట్రేలియా అంటే చాలా ఇష్టం. ఇక్కడే ఎక్కువగా విజయవంతమైన విషయం తెలిసిందే’’ అని ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి ఆండ్రూ గిల్స్ తెలిపారు.
అప్పట్లో జరిగిందిదీ..
21 గ్రాండ్స్లామ్లను గెలుచుకొని మంచి ఊపు మీదున్న జకోవిచ్ ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం సిద్ధమయ్యాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో పాల్గొనే ప్లేయర్లు తప్పనిసరిగా రెండు డోసుల టీకా వేసుకోవాలని నిర్వాహకులు నిబంధన విధించారు. కొవిడ్ సోకిందనే కారణంతో జకోవిచ్ మినహాయింపు కోరాడు. అందుకు టోర్నీ నిర్వాహకులు, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది. దీంతో టోర్నీ కోసం మెల్బోర్న్ చేరుకున్న జకోను ఎయిర్పోర్ట్లో సరిహద్దు భద్రతా దళం అడ్డుకుంది. మినహాయింపు కోరేందుకు అతడు చెప్పిన కారణం సహేతుకంగా లేదని వీసా రద్దు చేసి ఇమిగ్రేషన్ నియంత్రణలోని హోటల్కు తరలించింది. దీంతో కోర్టును ఆశ్రయించిన జకోకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అతని వీసా పునరుద్ధరించడంతో పాటు ఆ హోటల్ నుంచి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే అప్పటి ఇమిగ్రేషన్ మంత్రి అలెక్స్ మాత్రం తన వ్యక్తిగత అధికారాన్ని ఉపయోగించి మరోసారి జకోవిచ్ వీసాను రద్దు చేశారు. దీనిపైనే కోర్టుకు వెళ్లగా అక్కడా జకోవిచ్కు చుక్కెదురైంది. దీంతో ఆస్ట్రేలియా నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు