Rishabh Pant: లఖ్నవూతో మ్యాచ్లో.. రిషభ్ పంత్కు రూ.12 లక్షల జరిమానా
దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్కు భారీ జరిమానా పడింది. గతరాత్రి లఖ్నవూతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్రేట్ కారణంగా టీ20 లీగ్ నిర్వాహకులు రూ.12 లక్షల జరిమానా విధించారు...
ముంబయి: దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్కు జరిమానా పడింది. గతరాత్రి లఖ్నవూతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్రేట్ కారణంగా టీ20 లీగ్ నిర్వాహకులు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (61; 34 బంతుల్లో 9x4, 2x6) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం లఖ్నవూ నాలుగు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
అయితే, మైదానంలో తేమ కారణంగా దిల్లీ 150 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ క్రమంలోనే లఖ్నవూ ఓపెనర్ క్వింటన్ డికాక్ (80; 52 బంతుల్లో 9x4, 2x6) మెరుపు బ్యాటింగ్ చేశాడు. చివర్లో ఉత్కంఠకు దారితీసినా.. ఆయుష్ (10 నాటౌట్) బదోని ఆ జట్టును గెలిపించాడు. మరోవైపు దిల్లీకి ఈ సీజన్లో ఇది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. మొత్తంగా ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒకటే విజయం సాధించింది. తొలి మ్యాచ్లో ముంబయిపై విజయం సాధించిన ఆ జట్టు తర్వాత గుజరాత్, లఖ్నవూ జట్లతో ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఏడో స్థానంలో కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల