IND vs SA: పంత్పై కెప్టెన్సీ ప్రభావం.. అతడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి: సునీల్ గావస్కర్
అనుకోకుండా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రిషభ్ పంత్కు తొలి సిరీస్లోనే కఠిన పరీక్ష ఎదురైంది. అతని సారథ్యంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో టీమ్ఇండియా ఓటమిపాలైంది.
ఇంటర్నెట్ డెస్క్: అనుకోకుండా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రిషభ్ పంత్కు తొలి సిరీస్లోనే కఠిన పరీక్ష ఎదురైంది. అతని సారథ్యంలో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో టీమ్ఇండియా ఓటమిపాలైంది. వైజాగ్ వేదికగా నిన్న జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. సిరీస్ను చేజిక్కించుకోవాలంటే మిగతా రెండు మ్యాచ్ల్లో కూడా భారత్ విజయాల్ని నమోదు చేయాల్సి ఉంటుంది. పంత్ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే టీమ్ఇండియా తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైందని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు. అతడు బ్యాటింగ్లో కూడా ఇంతకుముందులా రాణించట్లేదు. తొలి టీ20లో 16 బంతుల్లో 29 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. మిగతా మ్యాచ్ల్లో తేలిపోయాడు. ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ ఆటతీరుపై భారత మాజీ బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాట్లాడారు. కెప్టెన్ తన ప్రదర్శన కంటే సహచర ఆటగాళ్ల ఆటతీరు గురించే ఎక్కువగా ఆలోచిస్తాడని, కొన్నిసార్లు నాయకత్వ బాధ్యతలు కెప్టెన్ ఆటతీరుపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
‘గత మూడు నాలుగు సంవత్సరాలుగా రిషభ్ పంత్ దూకుడైన ఆటతీరుతో అలరించాడు. ఆ ప్రదర్శనల కారణంగా పంత్ క్రీజులోకి రాగానే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడతాడని అభిమానులు ఆశించారు. కానీ, వారికి నిరాశ ఎదురైంది. అతడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కెప్టెన్సీలో తరచుగా జరిగేది ఏమిటంటే.. కెప్టెన్లు తమ ఆట గురించి ఆలోచించరు. ఇతర ఆటగాళ్ల ప్రదర్శన గురించి ఆలోచిస్తారు. దీంతో వారు (కెప్టెన్లు) తమ బ్యాటింగ్లో ఏదో సాంకేతిక సమస్య ఉందని లేదా బ్యాటింగ్ చేసే విధానంలో లోపం ఉందనే విషయాన్ని మార్చిపోతారు. పంత్ విషయంలో కూడా ఇదే జరిగి త్వరగా ఔట్ అవుతున్నాడు’అని గావస్కర్ వివరించారు. మూడో టీ20 మ్యాచ్లో టీమ్ఇండియా విజయం సాధించడంతో పంత్కు ఉపశమనం లభించిందని ఆయన పేర్కొన్నారు. ‘అతనికి ఇప్పుడు రెండు రోజుల సమయం ఉంది. మొదటగా భారత్ గెలిచినందుకు పంత్ చాలా సంతోషంగా ఉంటాడు. అతడిపై కొంచెం ఒత్తిడి తగ్గింది. టీమ్ఇండియా ఇంకా రెండు మ్యాచ్లు గెలవాలి. పంత్ ఇప్పుడు తన సొంత బ్యాటింగ్పై దృష్టి సారించాలి’ అని గావస్కర్ సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?