Rishahb Pant: అది కరెక్ట్ కాదు కానీ.. మాక్కూడా అన్యాయం జరిగింది: పంత్
రాజస్థాన్తో మ్యాచ్లో చివరి ఓవర్లో నోబాల్ వివాదంపై దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ తాము ప్రవర్తించిన తీరు కచ్చితంగా సరైందని కాదన్నాడు...
(Photo: Rishabh Pant Instagram)
ముంబయి: రాజస్థాన్తో మ్యాచ్లో చివరి ఓవర్లో నోబాల్ వివాదంపై దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ తాము ప్రవర్తించిన తీరు కచ్చితంగా సరైంది కాదని ఒప్పుకొన్నాడు. అయితే, తమకు కూడా అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చాడు. 223 పరుగుల భారీ ఛేదనలో దిల్లీ విజయానికి చివరి ఓవర్లో 36 పరుగులు అవసరమైన మేళ రోమన్ పావెల్ (36) వరుసగా మూడు సిక్సర్లు కొట్టి దిల్లీ శిబిరంలో ఆశలు రేపాడు. అయితే, మూడో బంతి నోబాల్లా కనిపించినా అంపైర్లు పట్టించుకోలేదు. దీంతో కాసేపు వివాదం తలెత్తి మ్యాచ్ నిలిచిపోయింది. ఈ క్రమంలోనే పంత్ తమ ఆటగాళ్లను వెనక్కి వచ్చేయమని చెప్పడం, సహాయక కోచ్ ప్రవీణ్ ఆమ్రె మైదానంలోకి వెళ్లి అంపైర్లతో మాట్లాడటం జరిగింది. దీంతో ఇదంతా పెను దుమారం రేపింది.
‘అంపైర్ల తీరుతో నిరాశకు గురయ్యా. ఆ బంతి చాలా స్పష్టంగా నోబాల్లా కనపించింది. అయితే అంపైర్లు స్పందించిన తీరుపై మేమంతా ఆగ్రహానికి లోనయ్యాం. అప్పుడు థర్డ్ అంపైర్ కలగజేసుకొని దాన్ని నోబాల్గా ప్రకటించాల్సింది. నేను ఒక్కడినే నియమాలు మార్చలేను కదా’ అని పంత్ వివరించాడు. అలాగే ఆమ్రెను మైదానంలోకి పంపడం సరైన పనేనా అని అడిగిన ప్రశ్నకు.. కచ్చితంగా కాదన్నాడు. కానీ, తమకు కూడా అన్యాయం జరిగిందని దిల్లీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. క్షణికావేశంలో అలా జరిగిపోయిందని, దాని గురించి చేయాల్సిందేం లేదన్నాడు. అనంతరం ఇదే విషయంపై రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ స్పందిస్తూ.. బంతి ఫుల్టాస్ పడటంతో అది సిక్సర్గా వెళ్లిందని, దాంతో అంపైర్ సరైన నిర్ణయమే తీసుకొని దానికి కట్టుబడి ఉన్నాడని చెప్పాడు. కానీ, దిల్లీ బ్యాట్స్మన్ దాన్ని నోబాల్గా పరిగణించాలని కోరారన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్